Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 28 : చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మే 24 లోపు పూర్తిచేయాలని ఎంపీడీవో విజయ్ కుమార్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో మంగళవారం సర్పంచ్ అల్లేపు సంపత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. చిగురుమామిడి మండలంలో 341 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా 38 ఇల్లు పూర్తిస్థాయిలో నిర్మాణాలు అయినాయని, మిగతావి చివరి దశలో ఉన్నాయనన్నారు.
రేకొండలో 36 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, 27 స్లాబ్ వరకు పూర్తయ్యాయని అన్నారు. త్వరితగతిగా పనులు పూర్తిచేయాలని లబ్ధిదారులను కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు రోంటాల లావణ్య, కానవేణి శ్రీనివాస్, లబ్ధిదారులు కుంట రేణుక, కాశవేణి నీలవ్వ, నెల్లి అరుణ, తీగల జయసుధ, మోర వెంకటలక్ష్మి, గోపగోనీ సునీత, కనకం మమత, గౌరిశెట్టి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.