ధర్మపురి,సెప్టెంబర్ 27: ఎన్నికల ముందర ఊర్లకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకుల గాలిమాటలు నమ్మద్దు. పొరపాటున వారికి అధికారమిస్తే మన బతుకులు అంధకారమవుతాయి’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. డబ్బు ఏండ్లు పాలించిన ఆ రెండు పార్టీలు దేశాన్ని అధోగతి పాలు చేశాయని మండిపడ్డారు. విద్య, వైద్యం, కరెంట్, సాగు, తాగునీరులాంటి మౌలిక వసతుల కల్పనలతో విఫలమయ్యాయని విమర్శించారు. ధర్మపురి మండలం రాయపట్నం, కమలాపూర్, పెద్దనక్కలపేట, దుబ్బలగూడెం, కొసునూర్పల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి పర్యటించారు. 10.77 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు. పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారాయయని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఇతర దేశాలకు వలసెళ్లిన వారు తిరిగి వాపస్ వస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీకి తెలంగాణలోని అభివృద్ధి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వారి పాలిత రాష్ర్టాల్లో గుక్కెడు తాగునీరందించని దుస్థితి ఉన్నదని దుయ్యబట్టారు. అలాంటి పార్టీల నాయకులు మాయమాటలు నమ్మితే 10 సంవత్సరాలు వెనుకకు పోతామన్నారు.
పేదరికంపై యుద్ధం చేసే లక్ష్యంతో 2014 ఆగస్టులో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించి, దీని ఆధారంగా రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. బడుగులు, బలహీనవర్గాల పిల్లలకు మెరుగైన విద్యనందించే తలంపుతో అన్ని హంగులతో దాదాపు వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఫ్రీ కరెంట్తో అన్నదాతలకు మేలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ తెలంగాణలో ప్రతిపల్లె ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ వారి బతుకుల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నరేశ్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ సౌళ్ల భీమయ్య, వైస్ చైర్మన్ అక్కనపల్లి సునీల్ సర్పంచులు కొండపెల్లి లక్ష్మి, మొగిలి శేఖర్, ఈర్ల చిన్నక్కమొండయ్య, శేఖర్, ఎన్నం లక్ష్మారెడ్డి నేత కొండపెల్లి సుధాకర్రావు ఉన్నారు.
కమలాపూర్ నుంచి బందంమాటు వరకు 1.10 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన. 30 లక్షలతో గ్రామం నుంచి వైకుంఠధామం వరకు నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం. 20 లక్షలతో మున్నూరుకాపు సంఘ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.29లక్షలతో పూర్తయిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనుల ప్రారంభం.
నక్కలపేట నుంచి బొదరి నక్కలచెరువు గూడెం వరకు రూ.2 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. రూ.18 లక్షలతో పూర్తి చేసిన మున్నూరు కాపు, రూ.10లక్షలతో పూర్తి చేసిన ముదిరాజ్ సంఘ భవనాలు ప్రారంభం. రూ.5లక్షలతో యాదవ సంఘ భవనానికి, రూ.8లక్షలతో గౌడసంఘ భవనానికి శంకుస్థాపన.
దుబ్బలగూడెం నుంచి తీగల ధర్మారం వ రకు రూ.1.20కోట్లతో నిర్మించే బీటీరో డ్డు , దుబ్బలగూడెం నుంచి రాజారం వరకు రూ.99లక్షలతో నిర్మించే బీటీ రోడ్డుకు శంకుస్థాపన.
కొసునూర్పల్లిలో రూ.21లక్షలతో నిర్మించిన జీపీ భవనం ప్రారంభం. బోయవాడ నుంచి రాజారం వరకు రూ.3కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు పనులు, రూ.4 0లక్షలతో పెరుమాండ్ల గూడెం నుంచి తీగలధర్మారం వరకు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన. అలాగే రూ.20లక్షలతో ఎస్సీ, ఎస్టీ కాలనీలో పూర్తి చేసిన సీసీ రోడ్డు పనులను ప్రారంభం.
రాయప్నటం నుంచి పెద్దమ్మగుడి వరకు రూ.30లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు,రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకు ప్రారంభం.