కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 13: స్వరాష్ట్రంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదని, పల్లె ప్రగతితో సమూల మార్పులు వచ్చాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. కరీంనగర్ మండలం బహ్దూర్ఖాన్పేట, నగునూర్ గ్రా మాల్లో గురువారం పర్యటించారు. గ్రామంలో రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్కు భూమి పూజ చే యడంతోపాటు 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 3.68కోట్ల నిధులతో తాహెర్ కొండాపూర్ నుంచి బహ్దుర్ఖాన్ పేట రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, నిర్మాణాన్ని త్వరితగతిన చేపడితే అందుకు అవసరమైన నిధులు అందిస్తామని హమీ ఇచ్చారు. అనంతరం మం త్రి మాట్లాడారు. గతంలో గ్రామాలకు సరిగ్గా రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. ‘నేనొక్కటే అడుగుతున్నా.. మీలో ఎవరైనా తీగలగుట్టపల్లి నుంచి పాత నగునూర్ రోడ్డును వేయాలని అడిగారా..? ఏ ఒక్కరూ అడగలేదు. కానీ నేనే రోడ్డును మంజూరు చేయించి, చెక్ డ్యా మ్పై బ్రిడ్జి నిర్మించిన’ అని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గ్రామాల్లో రోడ్లు వేయించానని, ఇప్పుడు మిగిలిన ఒక్క తాహెర్ కొండాపూర్ నుంచి బహ్దూర్ఖాన్ పేట రోడ్డు పనులను కూడా ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామంలో మంచినీటి బావి దాకా సీసీ రోడు మధ్యలో బీటీ రోడ్లు నిర్మించాలని కాంట్రాక్టర్కు సూచించారు. చామనపల్లి బహ్దుర్ఖాన్ పేట రోడ్డుకు మరమ్మతు చేయాల్సి ఉందని, త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
నగునూర్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ జాతీ య జెండా గద్దెను ప్రారంభించి, జాతీయ జెం డాను ఎగురవేశారు. గ్రామస్తులతో కలిసి జాతీయగీతం ఆలపించారు. గ్రామంలోని మహిళా భవనాన్ని ప్రారంభించారు. మహిళ భవనంలో సభ్యులకు కావాల్సిన 100 కుర్చీలు, టేబుల్స్, ఫ్యాన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలోని గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు. మరో 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. 2.44కోట్లతో పోచమ్మ కుంట వద్ద ఆర్అండ్బీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ప్రతిమ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్మించిన జిమ్ను ప్రారంభించారు. ‘నేను మీ బిడ్డనే. మీ మధ్యే ఉంటూ మీ కోసం, మీ సంక్షేమ కోసం పనిచేస్త. మీరు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్త’ అని మంత్రి పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో మంత్రి గంగులను సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఉపసర్పంచ్ దామరపల్లి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు కలిసి సన్మానించారు. ఇక్కడ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, గ్రామ సర్పంచ్ తపట్ట భూమయ్య, ఎంపీటీసీలు బుర్ర తిరుపతి, సాయిల వినయ్సాగర్, జడ్పీటీసీ పురుమల్ల లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, రాజేశ్వర్రావు, సుంకిశాల సంపత్రావు, బల్ల వెంకటేశ్వరు. మడికంటి మమత, చింత లక్ష్మన్. తప్పట్ల రమేశ్, తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ రజినీకాంత్, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, మండికంటి మారుతి, ఆర్బీఎస్ నగునూర్ కన్వీనర్ రాంరెడ్డి, దీలీప్ గౌడ్, బత్తిని రాజాగౌడ్, అంకమల్ల శ్రీనివాస్, సాయిల్ల మహేందర్, తదితరులు ఉన్నారు.