కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ)/హుజూరాబాద్: తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రగతిబాటలో ప యనిస్తున్నది. దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపక్షాన నిలిచి వారి అవసరాలను తీర్చుతోంది. మౌ లిక సదుపాయాలను కల్పిస్తూ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తోంది.
నియోజకవర్గంలోని రెండు జంట పట్టణాలుగా ఉన్న హుజూరాబాద్, జ మ్మికుంట తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊహించని రీతిలో అభివృద్ధిని సా ధించాయి. ఉమ్మడి రాష్ట్రంలో నగర పంచాయతీలుగా ఉన్న ఈ పట్టణాల ను బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. హుజూరాబాద్లో రూ.272 కోట్ల నిధులు ఖర్చుచేసి సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మించింది. మిషన్ భగీరథ, సెంట్రల్ లైటింగ్ తదితర పనులు చేశారు. రూ.3 కోట్లతో మోడ్రన్ శ్మశాన వాటిక నిర్మించింది. జమ్మికుంటలో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, మిషన్ భగీరథ, సెంట్రల్ లైటింగ్, ఇతరాత్ర పనులకోసం రూ.302 కోట్ల నిధులు ఖర్చు పెట్టింది. పట్టణంలో రూ.1.5 కోట్లతో ఉద్యావవనాన్ని తలనించే శ్మశాన వాటికను నిర్మించింది.
ఒకప్పుడు నరక ప్రాయంగా మారిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని రోడ్లు ఇపుడు ఎక్కడ చూసినా అద్దంలా మెరిసిపోతున్నాయి. హుజూరాబాద్-జమ్మికుంట రోడ్డుకు రూ.40 కోట్లు, హుజూరాబాద్-పర్కాల రోడ్డుకు రూ.100కోట్లు కేటాయించి నాలుగు లైన్ల రహదారులుగా మార్చేశారు. వీటితో పాటు జమ్మికుంట-పచ్చునూరు, జమ్మికుంట-కమలాపూర్, జమ్మికుంట-వావిలాల సింగిల్ రోడ్లను డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.145కోట్లు వెచ్చించారు. హుజూరాబాద్ నుంచి సిర్సపల్లి మీదుగా ఆముదాలపల్లికి గతంలో రోడ్లు సరిగ్గా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. కేసీ క్యాంపు నుంచి ములుకనూరు రహదారి బీటలు వారి ఉండేది. మొలంగూర్ నుంచి వీణవంక దాకా ఉన్న సింగిల్ రోడ్డు ప్రయాణం అంటేనే ప్రజలు జంకేవాళ్లు. వీటి అభివృద్ధికి రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇతర ఆర్అండ్బీ, పీఆర్ రోడ్ల కోసం రూ.30 కోట్లు ఖర్చుపెట్టింది. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇపుడు ఏ గ్రామానికి వెళ్లినా స్థానిక రోడ్లు జాతీయ రహదారులను మరిపించేలా మారిపోయాయి. రూ.34 కోట్లతో ఆయా గ్రామాల మధ్య వంతెన నిర్మాణం పూర్తి చేశారు.
మిషన్ కాకతీయతో చెరువులు కుంటల అభివృద్ధి, పలు వాగులపై చెక్డ్యాంల నిర్మాణం, కాకతీయ కాలువకు మరమ్మతులతో నియోజకవర్గంలో సాగుకు పుష్కలంగా నీళ్లు ఉండడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. రూ.71కోట్లతో దాదాపుగా 150 చెరువులు, కుంటలకు కట్టల మరమ్మతులు, ఫీడర్ చానళ్ల, మత్తడిల నిర్మాణం చేశారు. మానేరు వాగు, చిలుకవాగు, వీణవంక వాగు, కమలాపూర్, అంబాల వాగులపై పలు చోట్ల రూ.30 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించడంతో సముద్రంలో కలిసే వృథా నీళ్లకు అడ్డుకట్ట వేసినట్లయ్యింది. శిధిలావస్థలో ఉన్న కాకతీయ కాలువ లైనింగ్, కాలువ కట్టలు మరమ్మతుల కోసం రూ.121 కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టడంతో చివరి ఆయకట్టు నీరందుతున్నది.
తెలంగాణ వచ్చిన తర్వాత నియోజకవర్గంలో వైద్య సేవలు ఎంతో మెరుగుపడ్డాయి. హుజూరాబాద్లో 30 పడకల దవాఖానను 100 పడకలకు అప్గ్రేడ్ చేశారు. రూ.5కోట్లతో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ దవాఖానాలో ఇపుడు కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలందుతున్నాయి. రూ.6 కోట్లు వెచ్చించి జమ్మికుంట, కమలాపూర్లో 30 పడకల దవాఖానలకు కొత్త భవనాలు నిర్మించారు. అలాగే వీణవంక మండల కేంద్రంలో రూ.30 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించారు. చెల్పూర్, చల్లూర్ వంటి పీహెచ్సీల్లో సౌకర్యాలు మెరుగుపర్చారు. హుజూరాబాద్ ,జమ్మికుంట, కమలాపూర్ దవాఖానాల్లో కలిపి రోజుకు 15 ప్రసవాలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు పెరిగాయి. విద్యావకాశాలు మెరుగయ్యాయి. కమలాపూర్లో రూ.40 కోట్లతో ఎంజేపీ బాలుర, బాలికల, రూ.8 కోట్లతో ప్రభుత్వ కళాశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం భవనాలు, హుజూరాబాద్ పట్టణంలో రూ.2 కోట్లతో డిగ్రీ కళాశాల, ఇల్లందకుంటలో రూ.3.35 కోట్లతో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల, జమ్మికుంట పట్టణంలో రూ.3 కోట్లతో డిగ్రీ కళాశాల, రూ.1.50 కోట్లతో ప్రభుత్వ పాఠశాల నిర్మించారు. ఇల్లందకుంటలో రూ.9.35 లక్షలతో 18, వీణవంకలో రూ.2.75 కోట్లతో 18, హుజూరాబాద్ రూ.80 లక్షలతో 8, జమ్మికుంటలో రూ. 90 లక్షలతో 12, కమలాపూర్ రూ.1.20 కోట్లతో 14 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి కింద పునరుద్ధరించారు.
రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలతోపాటు గ్రామాలను అభివృద్ధి చేస్తోంది. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిదాయకమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి పల్లెలో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. దీని కోసం రూ. 12కోట్లు ప్రభుత్వం కేటాయించగా 99 శాతం శ్మశాన వాటికల నిర్మాణం పూర్తయ్యింది. రూ.5 కోట్లతో సెగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు నిర్మించారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి పల్లెలో పచ్చదనం వెల్లివిరిసేందుకు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. పారిశుధ్య లోపం లేకుండా ప్రతి రోజూ గ్రామాలను పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి గ్రామంలో చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ను ప్రభుత్వం సమకూర్చింది. రూ.12.60 కోట్లతో కొత్త పంచాయతీ భవనాలను నిర్మించింది. రైతుల కోసం రూ.5.06 కోట్లతో రైతు వేదికలను నిర్మించింది.
హుజూరాబాద్లో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కౌశిక్ రెడ్డి చేసిన ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని కుల సంఘాలు, మహిళా సంఘాల భవనాలకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. హుజూరాబాద్ స్టేడియం అభివృద్ధి కోసం రూ.10 కోట్లు మంజూరు చేయించారు. రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కౌశిక్ రెడ్డి పెద్ద మొత్తంలో నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే దీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.
అభివృద్ధి పనులే కాకుండా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తున్నది. కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు జరిగిన లబ్ధి రూ.63.10 కోట్లు అందించారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీ ద్వారా రూ.52 కోట్లు అందించారు. ఆసరా పథకం కింద 39,295 మందికి ప్రతి నెలా రూ.8.65 కోట్లు అందిస్తోంది. రైతుబంధు కింద 61,538 మంది రైతులకు ప్రతి సీజన్కు రూ.57.65 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్నది. అలాగే 81 బాధిత రైతు కుటుంబాలకు రూ.4.5 కోట్ల రైతుబీమా అందించింది.