ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ, నాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధ్దంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు కుట్రలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది. వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం. సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిద్దాం. జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతీయ సమగ్రతను నిలబెట్టుకుందాం. ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దాం.
– కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మొదట జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉంద ని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాటల్లోనే..
తెలంగాణ విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులను స్మరించుకోవల్సిన అవసరం ఉన్నది. ఆనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు కుమ్రం భీమ్, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యతోపాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజాఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్, దేవులపల్లి వెంకటేశ్వర్రావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవల్సిన అవసరం ఉన్నది. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవ రం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొ హియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖా న్ వంటి సాహితీమూర్తులు తెలంగాణకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలంగాణ 60 ఏళ్లపాటు అస్తిత్వం కోసం ఉద్యమించింది. కేసీఆర్ నాయకత్వంతో మలి దశ పోరాటం చేసి నేడు స్వరాష్ట్రమై అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతికాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది.
స్వరాష్ట్రంలో సంక్షేమం వెల్లి విరుస్తోంది. కుల వృత్తులు, చేతి వృత్తులతో పెనవేసుకున్న తెలంగాణలో ఒకప్పుడు బతుకు దెరువు లేక వలసలు వెళ్లిన వాళ్లు తిరిగి ఇక్కడికి చేరుకుంటున్నారు. అర్హులైన బీసీ కుల వృత్తిదారులకు బీసీ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,700 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించాం. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన మైనారిటీ వర్గాలకు కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలలోని 174 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున రూ.1.74 కోట్ల విలువైన చెకులను అందించాం.
ఒకప్పుడు రూ.50 నుంచి రూ.200 వరకు మాత్రమే పింఛను అందేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పింఛను సొమ్మును అంతకంతకూ పెంచుకుంటూ ఇప్పుడు రూ.2,016 చేశాం. దివ్యాంగులకు ఇప్పుడు రూ.4,016 ఇస్తున్నాం. బీడీ టేకే దారులకు కూడా రూ.2,016 పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటి స్థలం కగిలి ఉంటే ఇల్లు నిర్మాణం కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. ప్రతి నియోజక వర్గానికి 3,000 మందికి ఈ విడుతలో ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒకటే.
దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీల సేవలను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలకు అంతే గౌరవం దకేలా టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచాం. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తాం. అంతే కాకుండా, ఆసరా పెన్షన్లు మంజూరుచేసి ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీల ఆత్మగౌరవాన్ని నిలుపుతాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి అధిక వేతనాలు అందిస్తున్నాం.
డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయ స్ఫూర్తితో రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రతి దళిత కుటుంబానికి స్వయం ఉపాధి కోసం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు యూనిట్ల ఎంపికలోనూ లబ్ధిదారులకు సరైన అవగాహనను కల్పిస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.1,784 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించాం. మిగతా ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు అందించాం. ఈ పథకం నిరంతరం కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందిస్తున్నాం. రైతులకు మంచిరోజులు రావాలని, ప్రతి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం తెచ్చారు. వ్యవసాయం కోసం ఏడాదికి ఎకరాకు రూ.10 వేల పెట్టుబడిని అందిస్తున్నాం. రూ.5 లక్షల రైతు బీమా ఇచ్చేందుకు ఎల్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. 2018 రుణమాఫీ పథకం కింద జిల్లాలోని 49,544 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 261.19 కోట్లను ఇప్పటి వరకు జమచేశాం.
కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండి, పేద విద్యార్థికి అందని ద్రాక్షగా మారిన వైద్య విద్యను సీఎం కేసీఆర్ విస్తృతం చేశారు. జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఏ రాష్ట్రంలో లేని విధంగా 85 శాతం సీట్లు తెలంగాణ బిడ్డలకే దకేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో నిర్మించిన 150 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలతో పాటు, నెలకు 800 నుండి 900 ప్రసవాలు జరుగుతున్నాయి. మహిళలు గర్భందాల్చిన నుంచి అమ్మ ఒడి వాహనాల ద్వారా డాక్టర్ల వద్దకు తీసుకువచ్చి పరీక్షలు చేయించి తిరిగి ఇంటికి తీసుకెళ్లే వరకు సేవలు అందిస్తున్నాం. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ను ప్రవేశపెట్టి కోటీశ్వరులు, లక్షాధికారులు తినగలిగే వస్తువులను పేదల కోసం అందిస్తున్నాం. మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు, ఆడ శిశువు జన్మిస్తే రూ.13 వేల చొప్పున కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తున్నాం.
చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని ప్రభుత్వమే భరించి లాభాలను మాత్రం మత్స్యకారులకు అందించేలా సమీకృత మత్స్య అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. రాష్ట్రంలో వచ్చిన నీలి విప్లవంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన స్థితి నుంచి ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. జిల్లాలో 2023-24 సంవత్సరంలో రూ.2. 55 కోట్ల విలువైన బొచ్చ, రవ్వు, మెరిగ, బంగారు తీగ చేపలను రూ.34 లక్షల విలువైన నీలకంఠ రొయ్య పిల్లలను నీటి వనరుల్లో విడుదల చేశాం.
కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కల్లోలిత ప్రాంతంగా ఉండేది. ఇకడికి బదిలీపై వచ్చే ఉద్యోగులు పనిష్మెంట్గా భావించే వారు. అభివృద్ధి విషయంలో కూడా ఆమడ దూరంలో ఉండేది. జిల్లాలో ఎకడ చూసినా చెత్తకుండీలు, మురుగు నీటికి సరైన కాలువలు లేక, వచ్చే దుర్వాసనలు ఓవైపు, చెత్త చెదారం దుర్గంధం వెదజల్లే ప్రాంతాలు మరో వైపు ఉండేవి. సరైన రోడ్డు మార్గం ఉండేది కాదు. పకనే మానేరు ఉన్నా నీళ్ల కోసం కొట్లాడే పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా కరీంనగర్లో ఏమూల చూసినా అద్భుతమైన రోడ్లు, రాత్రి పూట జిగేల్ మనే విద్యుత్ లైట్లు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలతో హైదరాబాద్ తరువాత మరో అద్భుత నగరంగా కరీంనగర్ విరాజిల్లుతోంది. ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకట్టుకునేలా మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణం చేపడుతున్నాం.
చైనా, సియాల్ తరువాత ఈ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ ఫౌంటెయిన్ (బిగ్వో) ఏర్పాటు చేస్తున్నాం. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేసి బోటింగ్ కూడా ప్రారంభిస్తాం.” అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ బీ గోపి, సీపీ ఎల్ సుబ్బారాయుడు, నగర మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, జిల్లా అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజుతోపాటు పలువురు కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుల వారసులను మంత్రి గంగుల ఘనంగా సన్మానించారు.
పల్లెప్రగతి స్ఫూర్తితో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరుచుకొని ఓడీఎఫ్ ప్లస్ జిల్లాగా ప్రకటించుకున్నాం. గ్రామాల్లోని ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల వినియోగం, ప్రతి ఇంటి నుంచి తడిపొడి చెత్త సేకరణ, తడిచెత్తతో ఎరువుల తయారు చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవడం, ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డెన్లు వంటి కార్యక్రమాలను చేపట్టడంలో మన గ్రామాలు ముందంజలో ఉన్నాయి. 9 మండలాల పరిధిలోని 15 గ్రామాలకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ-2023 అవార్డులు రావడం గర్వకారణం. గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామాన్ని రెండో స్థానంలో, రామడుగు మండలం వెలిచాల గ్రామాన్ని 5వ స్థానంలో గుర్తించి స్వచ్ఛ గ్రామీణ రాష్ట స్థాయి అవార్డులు అందించాం. జిల్లాలో ప్రగతికి సహకరిస్తున్న 118 మంది గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసింది.