కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 23: కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ఎకరం అయినా పంట ఎండిందా.. రైతుబంధు ఆగిందా.. కరెంట్ సరఫరా నిలిచిందా.. అని ఆలోచించాలని కోరారు. కానీ కేసీఆర్ దిగిపోగానే కరెంట్ బందయింది, రైతుబంధు ఆగిపోయింది. పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. శనివారం కరీంనగర్లోని మాజీ ఎంపీ వినోద్కుమార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా కేసీఆర్ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన ఉద్యోగ పరీక్షలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చి తామే ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ వాళ్లు చెప్పుకొనేందుకు సిగ్గు ఉండాలన్నారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ టెట్లో గతంలో పేపర్కు రూ.400 ఉండగా ఇప్పుడు వెయ్యి చేశారని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు దూలం సంపత్గౌడ్, రేణుక పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, మార్చి 23: పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పంజాల కుమారస్వామి సోదరుడు తిరుపతి గౌడ్ ఇటీవల మృతి చెందగా, శనివారం బాధిత కుటుంబ సభ్యులను హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పరామర్శించారు. ముందుగా తిరుపతిగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.