హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 30: తెలంగాణలో బీజేపీ హత్య రాజకీయాలు చేస్తున్నదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, విప్ పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో హుజూరాబాద్లో ఈటల హత్యా రాజకీయాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఇలాంటివి సహించరని ఘా టుగా స్పందించారు. హుజూరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో కౌశిక్రెడ్డి మాట్లాడా రు. ఎంపీ ప్రభాకర్రెడ్డిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు అత్యంత సన్నిహితుడైన రాజు హత్యాయత్నానికి ప్రయత్నించాడని, వెంటనే అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బీజే పీ హత్యా రాజకీయాలతో కొత్త సంస్కృతిని మొ దలుపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఇకడి ప్రస్తుత ఎమ్మెల్యే ఈటల కూడా హత్య రా జకీయాలు చేశారని, వీణవంక మండలం నర్సింగాపూర్లో బాలరాజును హత్య చేయించింది ఆయనే అని ఆరోపించారు. పెద్దపాపయ్యపల్లికి చెందిన ప్రవీణ్యాదవ్ను కూడా పోలీస్స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా చేసి ఆయన చావుకు కారణమయ్యాడని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో మర్రిపెల్లిగూడెంలో తనపై కూడా హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు హత్య రాజకీయాలను సహించరని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతారని హితవు పలికారు. హత్య రాజకీయాలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇకనైన పులిస్టాప్ పెట్టాలని, లేనైట్లెతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
నవంబర్ ఒకటి (బుధవారం) నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానని పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు హుజూరాబాద్ ప్రధాన చౌరస్తా వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మద్దతు ప్రకటించాలని కోరారు. బీఆర్ఎస్ తరఫున నాయకులు, ప్రతి ఒకరూ పార్టీకి నిబద్ధులై ఉండాలని సూచించారు. ప్రతి ఒక నాయకుడు, కార్యకర్త తమ బాధ్యతను భుజాన వేసుకొని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను నియోజకవర్గంలోని ప్రజలందరికీ అర్థమయ్యేలా వివరించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సంగె ఐలయ్య, రాష్ట్ర నాయకులు ఇరుమల్ల సురేందర్రెడ్డి, వర్దినేని రవీందర్రావు, రావుల రాజలింగారెడ్డి, కౌన్సిలర్లు, రమాదేవి, కుమార్యాదవ్, నాయకులు దాసరి రమణారెడ్డి, తిరుపతిరెడ్డి, ఎడవెల్లి కొండాల్రెడ్డి, సందమల్ల బాబు, సమ్మయ్య, ప్రభాకర్, కిరణ్గౌడ్, రియాజ్, వెంకటేశ్గౌడ్, మధు, ఫయాజ్, మధూకర్, సదానందంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.