వేములవాడ టౌన్, జూలై 31 : శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుకున్నారు. కోడెమొక్కు తీర్చుకున్నారు.
క్యూలైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆర్జితసేవలను రద్దు చేశారు. రాజన్నను సుమారు 20 వేల మందికి పైగా దర్శించుకున్నారని, వివిధ ఆర్జితసేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.12లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.