Fire Accident | కోరుట్ల, ఫిబ్రవరి 28 : కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. బాధిత కుటుంబసభ్యులు, మెట్పల్లి పైర్ స్టేషన్ ఆఫీసర్ కృష్ణకాంత్ కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ ఇంటిలో ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు ఉదృతంగా వ్యాప్తించి కిచెన్, బెడ్ రూమ్ లోని బట్టలు, మంచాలు, కిటీకీలు, దర్వాజలు, ఫ్రిజ్లు, ఏసీలు, ఇతర విలువైన సామగ్రి కాలిబూడిదయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసేలోపు ఇంటిలోని సామగ్రి కాలిపోయినట్లు రజియోద్దీన్ వాపోయాడు. సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని తెలిపాడు. మెట్పల్లి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి అంచనా వివరాలను నమోదు చేసుకున్నట్లు పైర్ ఆఫీసర్ కృష్ణహరి తెలిపారు.