వీణవంక, అక్టోబర్ 11: చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు, బావులు నిత్యం నిండుకుండలా ఉండేలా రూ.25 కోట్లతో కల్వల ప్రాజెక్ట్ను మినీ ఎల్ఎండీగా మారుస్తానని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, ఘన్ముక్ల, కిష్టంపేట గ్రామాల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మండలి విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసని, గ్రామాలకు వస్తే నీళ్ల బిందెలతో నిరసన తెలిపేవారన్నారు.
సాగునీరు లేక రైతన్నలు పట్టణాలకు వలసపోయిన సందర్భాలు ఉన్నాయని, ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోక ప్రజలు నానా కష్టాలు పడ్డారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపుదిద్దుకొని గుంట భూమి కూడా బీడు లేకుండా సాగవుతున్నదని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ కల్యాణ లక్ష్మి, రైతుబంధు, కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్, ఇలా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. మూడోసారి కూడా సీఎం కేసీఆరే అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
చల్లూరును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ను గెలిపించినా, రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చినా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కత్తి ఒకరికి ఇచ్చి మరొకరిని యుద్ధం చేయమనొద్దన్నారు. ఒక్కసారి తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే రూ.వెయ్యి కోట్ల నిధులు తెచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనంతరం ఘన్ముక్ల, దేశాయిపల్లి గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు జున్నుతుల సునీత-మల్లారెడ్డి, బండారి ముత్తయ్య, సింగిల్విండో మాజీ చైర్మన్ గంగాడి తిరుపతిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, ఉసర్పంచులు వీరయ్య, అప్పాల శంకర్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు మండల సంపత్యాదవ్, శ్రీనివాస్, రాజిరెడ్డి, నాయకులు కిషన్రెడ్డి, మూల పుల్లారెడ్డి, రాజయ్య, శ్రీనివాస్, రవీందర్, మధూకర్రెడ్డి, గంగారెడ్డి, గోపాల్రెడ్డి, నసీరొద్దీన్, ముత్యాల శంకర్, కార్యకర్తలు పాల్గొన్నారు.