పెగడపల్లి, మే 28: ‘బీఆర్ఎస్ ఇంటి పార్టీ. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రజాకాంక్షలు నెరవేరుస్తూ అండగా నిలుస్తోంది. జనమంతా మన వెంటే ఉ న్నారు. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయం’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పెగడపల్లి మండల కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంత్రి ఈశ్వర్ అధ్యక్షతన బీఆర్ఎస్ మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, ఎంపీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించిందని, అయితే 60 ఏండ్ల నుంచి రాని తెలంగాణ ఇప్పుడొస్తదా..? అని చాలా మంది విమర్శలు చేశారని, కానీ కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ రాకముందు, వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారా యో..?
ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాల పాలనలో విద్యుత్ కోతలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కానీ స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా నిరంతర విద్యుత్ను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కాదేనని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బావులకు మీటర్లు పెడితే రూ.30వేల కోట్లు ఇస్తామని చెబుతున్నదనీ, కానీ సీఎం కేసీఆర్ తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకూ వాటిని పెట్టనిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పినట్లు గుర్తు చేశారు. గతంలో ధర్మపురి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ఖాళీ బిందెలతో నిరసనలు ఎదురయ్యేవని, ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధ జలం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదని, ఎన్నికలు వస్తున్నాయనే ప్రజల్లోకి వస్తున్నారని దుయ్యబట్టారు. బూటకపు మాటలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని, వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు.
ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎంతో మంది విమర్శలు చేశారని, కానీ ప్రాజెక్టును పూర్తిచేసుకొని రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు నీరందిస్తూ తెలంగాణను సస్యశ్యామలం చేసుకున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు కష్టాలు తప్ప లాభం లేదని, తొమ్మిదేండ్ల పాలనలో దేశాన్ని ఆర్థికంగా అధోగతి పట్టించిందని మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. వాళ్లు ఇచ్చేది ఏం లేకపోయినా రాష్ట్ర సర్కా రు అమలు చేసే ఉచిత పథకాలను రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రజ లు బతుకుదెరువుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్న బీజేపీ సర్కారును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల అండతోనే తాను మంత్రిగా పనిచేస్తూ, నియోజకవర్గంలోని 150 గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని చెప్పారు. 13ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తూ, రూ.1500 కోట్లతో అభివృద్ధి చేశానని, సీఎంఆర్ఎఫ్ కింద 26,600 మందికి సాయం చేసినట్లు చెప్పారు.
రూ.750 కోట్లతో ధర్మపురికి ఇథనాల్ ప్రాజెక్టు తీసుకువస్తే, అభినందించాల్సింది పోయి అర్థం లేకుండా మాట్లాడుతూ అడ్డుకుంటున్నారని, వారిపై సొంత పార్టీ నాయకులే ఎదురుతిరిగే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇక్కడ ఎంపీపీ గోలి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, కర్ర భాస్కర్రెడ్డి, మంత్రి వేణుగోపాల్, ఏఎంసీ చైర్పర్సన్ లోక నిర్మల, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి వెంకన్న, యూత్ మండల అధ్యక్షుడు సంతోష్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ జమున, నాయకులు కరుణాకర్రావు, ఆనందం, మోహన్రెడ్డి, సత్యనారాయణ, నర్సింహరెడ్డి, రాజిరెడ్డి, సత్తయ్య, లోకేష్, మల్లారెడ్డి, తిరుపతినాయక్, షకీల్, తిరుపతి, రమేశ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్గౌడ్, గంగాధరగౌడ్, శ్రీరాములు, ప్రవీణ్రావు, రాజేశం, విజయ్యాదవ్, ఎండీ జానీ, సంజీవరెడ్డి, సాగర్, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజేశ్వర్రావు, రవీందర్, కో-ఆప్షన్ సభ్యుడు రహీం, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈశ్వర్ చొరవతోనే ధర్మపురి అభివృద్ధి..
మంత్రి ఈశ్వర్ ప్రత్యేక చొరవతోనే ధర్మపురి నియోజకవర్గం అన్ని రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించింది. వందలాది కోట్లతో చేసిన పనులతో తొమ్మిదేండ్లలోనే రూపురేఖలన్నీ మారిపోయాయి. పెగడపల్లి మండలం సరికొత్తగా మారింది. ఒకప్పుడు మన మండలం ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉందో జరిగిన ప్రగతిని చూస్తేనే తెలుస్తుంది. ప్రజా సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ మంత్రి కొప్పుల ఈశ్వర్నే గెలిపించుకోవాలి. బీఆర్ఎస్కు గంపగుత్తగా ఓట్లేసి భారీ మెజార్టీ తీసుకురావాలి.
– కాసుగంటి రాజేందర్రావు, పెగడపల్లి జడ్పీటీసీ
పథకాలపై ప్రచారం చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. వాటిపై కార్యకర్తలు విస్తృత ప్రచారం చేసి అ ర్హులందరికీ అందేలా కృషిచేయాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పాలన లో తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెడు తోంది. సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కుదేలైంది. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతు బంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తూ సేద్యాన్ని పండుగలా మార్చారు. పేదింటి ఆడబిడ్డల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు గెలిస్తే సంక్షేమ పథకాలు రద్దు చేసే ప్రమాదం ఉంది. వచ్చే ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్పాలి. కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతో పార్టీని గెలిపించాలి. మంత్రి ఈశ్వర్ కృషితో ధర్మపురి అభివృద్ధి, సంక్షేమంలో ముందున్నది. ఇంకా ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం, మంత్రి సతీమణి స్నేహలత కూడా ప్రజలకు సేవలందించడం అభినందనీయం.
– వెంకటేశ్నేతకాని, పెద్దపల్లి ఎంపీ
ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి..
వచ్చే ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. సీఎం కేసీఆర్, మంత్రి ఈశ్వర్ నేతృత్వంలో పెగడపల్లి మండలం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఒకప్పుడు మన మండలం ఎలా ఉందో..? ఇప్పుడు ఎలా ప్రగతి సాధించిందో అందరికీ తెలుసు. కోట్లాది నిధులతో పనులు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. మండల కేంద్రం నుంచి ఉమ్మడి కరీంనగర్తో పాటు జగిత్యాల జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లు వచ్చినయి. తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలను నందగిరి, ఐతుపల్లి గ్రామాలకు తెచ్చేందుకు మంత్రి ఈశ్వర్ కృషి ఎనలేనిది.
– గోలి శోభ-సురేందర్రెడ్డి, పెగడపల్లి ఎంపీపీ
మన పథకాలు దేశానికి ఆదర్శం..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం అంధకారంలో మగ్గింది. అభివృద్ధికి దూరంగా ఉంది. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. గతంలో మన ప్రాంతవాసులు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారు. కానీ ఈ రోజు మనమే వివిధ రాష్ర్టాల పేద ప్రజలకు ఉపాధి చూపే స్థాయికి ఎదిగాం. ఎంతో మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తూ బతుకుతున్నారంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో మరో సారి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి.
– వోరుగంటి రమణారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత