అన్నం పెడుతున్న భూమికి హక్కు పత్రాలు లేక ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. కాస్తులో ఉన్నామనే మాటే గానీ ఎప్పుడు ఎవరు వస్తారో..? కాదు పొమ్మంటారోనన్న భయంతో ఏండ్లుగా నరకం చూస్తున్న లంబాడీలు, ఆదివాసీల సమస్యకు శాశ్వత పరిష్కారంచూపుతున్నది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేయబోతున్నది. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాలో 2,858 ఎకరాలకు సంబంధించి 1,614 మంది లబ్ధిదారులను గుర్తించింది. శుక్రవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, అడవిపుత్రుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల, జూన్ 28 (నమస్తే తెలంగాణ): మారుమూల తండాలు, గూడేల్లో జీవిస్తున్న గిరిపుత్రులు తమ తాతముత్తాతల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్నారు. కానీ హక్కు పత్రాలు లేక దినదిన గండంలా బ తుకుతున్నారు. అత్యంత పేదరికంలో ఉన్న వీరి ని సమైక్య సర్కారు నిర్లక్ష్యం చేసింది. కష్టించడ మే తప్ప.. ప్రశ్నించడం తెలియని గిరిపుతులపై కఠినంగా వ్యవహరించింది. అటవీశాఖ అధికారులు దాడులు చేయడం, కేసులు పెట్టడం ఏం డ్లుగా జరుగుతుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అ క్కున చేర్చుకున్నది. స్వరాష్ట్ర ఉద్యమంలో తం డాలను సందర్శించిన సీఎం కేసీఆర్.. తండాలను పంచాయతీలుగా చేస్తామని, పోడు భూ ముల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు. ఇచ్చిన హామీ మేరకు తండాలను పంచాయతీలుగా చేశారు. పోడు భూముల హక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నెల 30నుంచి పట్టాల పంపిణీ చేయాలని నిర్ణయించగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రంగం సిద్ధమైంది.
ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తండాల్లో పర్యటించినపుడు గిరిపుత్రులంతా పోడు భూములతో వస్తున్న ఇబ్బందులను మొ రపెట్టుకున్నారు. వారి దయనీయ స్థితికి చలించిన రామన్న ‘నేనున్నానంటూ’ ధైర్యం ఇచ్చా రు. అక్కడికక్కడే అటవీశాఖ అధికారులను పిలిచి వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. అప్పటికే పోడు పట్టాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రక్రియను వేగవంతం చేశారు.
సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని అటవీ ప్రాంతాల్లో అటవీ భూములను వందలాది మంది గిరిజనులు ఏండ్లుగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జిల్లాలో సాగవుతున్న పోడు భూములపై యంత్రాంగం సర్వే చేసింది. గిరిజనులు అత్యధికంగా ఉండే వీర్నపల్లి, గంభీరావుపేట, రుద్రం గి, కోనరావుపేట, మానాల (ప్రస్తుతం బాల్కొం డ నియోజకవర్గంలో ఉంది.)లోని అటవీప్రాంతాల్లో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు గిరిజనులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సాగవుతున్న భూములు, రైతుల వివరాలు సేకరించారు. నేరుగా కలెక్టర్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆరునెలలుగా సర్వే చేసి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశారు. జిల్లాలో 1614 మంది లబ్ధిదారులు 2,859.34 ఎకరాల్లో వివిధ పంటలు సా గు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో సిరిసిల్ల ని యోజకవర్గంలో 880 మంది 1303 ఎకరాలు, వేములవాడ నియోజకవర్గంలో 734 మంది 1555 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వీరందరికీ రేపటి నుంచి మంత్రి కేటీఆర్ చేతులమీదుగా పట్టాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
పెద్దపల్లి, జూన్ 28(నమస్తే తెలంగాణ): పోడు భూముల పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన సర్వేలో ము త్తారం మండలం అడవి శ్రీరాంపూర్కు చెందిన ముగ్గురు గిరిజనులను ఎంపిక చేసి వారికి భూ యాజమాన్య పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెం దిన పోలం మధునమ్మ, లస్మయ్య, నర్సయ్య, రాజయ్య కాస్తులో ఉన్న దాదాపు రెండెకరాల భూమికి సంబంధించిన యాజమాన్య పట్టాలను శుక్రవారం అందజేయనున్నారు. కలెక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఏర్పాట్లు చేస్తున్నారు.
నాపేరు ఆజ్మీర సునీత. మాది గంభీరావుపేట మండలం. మా మామ క రాంలాల్నాయక్ 40 ఏండ్లుగా ఎకరంన్నర భూమిని సాగు చేస్తున్నాడు. కొద్ది కాలం కింద మామ కాలం చేసిండు. భర్త భాస్కర్ నేను కలిసి వరి సాగు చేస్తున్నం. వరి పంటేసినప్పుడల్లా ఫారెస్టు వాళ్లు వచ్చి ఇబ్బందులు పెడుతుండే. తిన్నకూడు మనసున పట్టేది కాదు. మూడేళ్ల కింద కేటీఆర్ సార్ మా తండాకు వచ్చినపుడు గోసచెప్పుకున్నం. ‘నేనున్న కదా? మీకేం ఇబ్బంది లేదు. నేను చూసుకుంటా’ అన్నడు. అప్పుడు మాకెంతో ధైర్యం వచ్చింది. పట్టాలు ఇస్తమని సార్లు మా ఊరికొచ్చి పేరు రాసుకొని పోయిండ్రు. లిస్టులో నాపేరు చూసుకుని సంబురపడ్డ. రామన్న దయతో పోడు భూములకు పట్టాలిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అన్న పేరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటం.
– ఆజ్మీర సునీత, గంభీరావుపేట మండలం
ఏండ్ల కేండ్లుగా పట్టాల కోసం ఎదురు సూత్తున్నం. మా అత్తమామలు దున్నుకుంటున్న భూమి మాకిచ్చిండ్రు. వీర్నపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో భూములున్నయి. మొన్నమొన్ననే మండలం అయ్యింది. ఇక్కడ ఏపని దొరకదు. ఉన్న భూముల్లోనే పంట సాగు చేసుకుంటున్నా. కుటుంబ పోషణ బట్టపొట్టకే అయితంది. తాపకోసారి ఫారెస్టు వాళ్లు వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నరు. మంతిర కేటీఆర్ సారు వచ్చినపుడల్లా మా గోస చెప్పుకుని ఏడ్చిన రోజులున్నయ్. సార్ పట్టాలిస్తానని చెప్పిండు. చాలా ధైర్యం అచ్చింది. అనుకున్నట్లే శుక్రవారం నాడు పట్టాలు ఇత్తున్నారని మా ఊరి సర్పంచ్ చెబితే కడుపు నిండింది. మంత్రి జెయ్యవట్టి మాకు పట్టాలొత్తున్నయి. సార్ను జీవితాంతం యాజ్జేసుకుంటం.
– గుగులోతు కైక, మహిళా రైతు, వీర్నపల్లి మండలం