తిమ్మాపూర్, సెప్టెంబర్ 27: మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో గణనాథుడిని కొలిచిన భక్తులు.. చివరి రోజు డప్పు చప్పుళ్ల మధ్య అందంగా అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. సాయంత్రం నుంచే ప్రారంభమైన నిమజ్జనం కార్యక్రమాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈసారి కుంటలు, చెరువుల్లో నీళ్లు పుషలంగా ఉండడంతో ఏ గ్రామంలోని విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసుకున్నారు. కొన్ని గ్రామాల భక్తులు గణనాథులను దిగువ మానేర్ జలాశయంలో నిమజ్జనానికి తరలించారు. మండపాల్లో లడ్డూ వేలం నిర్వహించగా, భక్తులు పోటీపడి దకించుకున్నారు. మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
మానకొండూర్, సెప్టెంబర్ 27: వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం మానకొండూర్ పెద్దచెరువులో అట్టహాసంగా సాగింది. మండలంలోని ఆయా గ్రామాల వినాయకులతో పాటు కరీంనగర్ నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను పెద్దచెరువుకు తరలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చెరువువద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచే చిన్న విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. చిన్న వినాయకుల విగ్రహాలను భక్తులు ట్రాలీఆటోలు, ఇతర వాహనాల్లో తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు ఎం రాజ్కుమార్, ఇంద్రసేనారెడ్డి పర్యవేక్షించారు. నిమజ్జనం కార్యక్రమాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు పరిశీలించారు.
మానకొండూర్ పెద్దచెరువులో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుధవారం సాయం త్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి చెరువుకట్ట వద్ద ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఓ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, ఎంపీపీ ముద్దసాని సులోచనాశ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి, తహసీల్దార్ రాజు, వివిధ శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 27: మండలంలోని గంగిపల్లి, కొండపల్కల, ముంజంపల్లి, గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల, ఊటూర్, వెల్ది, రంగపేట తదితర గ్రామాల్లో బుధవారం వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మానకొండూర్ సీఐ రాజకుమార్ బందో బస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ రూరల్, సెప్టెంబర్ 27: మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. పలు గ్రామాల్లో నాయకులు మండపాల్లో చివరి రోజు ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి, ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
గన్నేరువరం రూరల్, సెప్టెంబర్ 27: మండలంలోని ఖాసీంపేట శ్రీ మానసాదేవి ఆలయంలో ఏర్పాటుచేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నవరాత్రుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడిని ఆలయ సమీపంలోని ఉపకాల్వలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో లడ్డూ, కలశం వేలం నిర్వహించారు. రూ.21 వేలకు లడ్డూను ఆలయ ప్రధాన అర్చకుడు మామిడాల నాగసాయి శర్మ, కలశంను గ్రామానికి చెందిన బద్దం రమణారెడ్డి దకించుకున్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు బద్దం నరసింహారెడ్డి, ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బద్దం మల్లారెడ్డి, డైరెక్టర్లు కర్నే చంద్రయ్య, సందవేని, లక్ష్మణ్ బుర్ర ఎల్లయ్య, బొజ్జ నాగయ్య, సాయిని చొకయ్య, కల్లేపల్లి దుర్గయ్య, బద్దం తిరుపతిరెడ్డి, బద్దం లచ్చిరెడ్డి, ఆకేనా రవీందర్, బద్దం వెంకట్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీనారాయణ భక్తులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, సెప్టెంబర్ 27: మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం గణేశ్ నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి విగ్రహాలను ట్రాక్టర్ల ద్వారా ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టారు. నిమజ్జనం సందర్భంగా మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ రాజేశ్ పెట్రోలింగ్ నిర్వహించారు.
శంకరపట్నం, సెప్టెంబర్ 27: మండలంలోని అన్ని గ్రామాల్లో గణేశ్ విగ్రహాలను స్థానిక జలాశయాల్లో నిమజ్జనం చేశారు. తుది రోజు భక్తులు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానాలు చేశారు. లడ్డూ వేలం పాటలు నిర్వహించారు. పలువురు భక్తులు లడ్డూ ప్రసాదాలను దక్కించుకునేందుకు వేలం పాటలో పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కేశవపట్నం రామ్సేన యూత్ ఆధ్వర్యంలో మహిళా భక్తులు స్వామి వారికి ప్రత్యేక ప్రసాదాలు నివేదించారు. శోభాయాత్రలో మహిళల కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాత్రి కొత్తగట్టు, ముత్తారం, తాడికల్తో పాటు ఆయా గ్రామాల సమీపంలోని చెరువులు, వాగుల్లో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.