Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 9 : కుష్టి వ్యాధికి ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తుందని పెద్దపల్లి జిల్లా పార మెడికల్ అధికారి బీ దేవి సింగ్ అన్నారు. కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని 15 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా స్లాక్ అనే కార్యక్రమం ద్వారా మండల కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాలలో కుష్టు వ్యాధి నివారణ పై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవి సింగ్ మాట్లాడుతూ కుష్టి వ్యాధి వస్తే ప్రారంభ దశలోనే గుర్తించి ఎండీటీ అనే బహుళ ఔషధ చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చన్నారు. ఈ మందులు ప్రభుత్వాసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. శరీరంపై మొద్దు బారిన మచ్చలు ఏర్పడే అవి రాగి రంగులో ఉంటాయి అన్నారు.
చర్మం పాలిపోయినట్లు ఉండి మచ్చలపై చెమట రాకకుండా ఉండడంతోపాటు చర్మం కంటే మచ్చలు ఉబెత్తుగా ఉండే ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వారు కేంద్రంలో డాక్టర్ ను సంప్రదించి మందులు వాడినట్లయితే ఎలాంటి అంగవైకల్యం రాకుండా పూర్తిగా తగ్గిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, మహేందర్, సత్యనారాయణ రావు, హెచ్ఈఓ శ్రీనివాస్ వినీత్, కళాశాల ప్రిన్సిపాల్ జక్కుల కుమార్, ఏఎన్ఎం సూత్రాల సరోజన, ఆశా కార్యకర్తలు శారద, భూలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.