వెల్గటూర్, సెప్టెంబర్ 17: కట్టు కథలు చెప్పే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు..నలభై ఏండ్ల వారి పాలనలో ప్రజలకు చేసిందేమీలేదు’ అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం వెల్గటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా శాఖాపూర్, వెంకటాపూర్, రాంనూర్, బూరుగుపల్లి గ్రామాలకు చెందిన 170 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కొప్పుల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే వెల్గటూర్ మార్కెట్ యార్డులో రూ. 1.60 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు. అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా రైతుబంధు, 24 గంటల ఫ్రీ కరెంట్ లాంటి స్కీంలను తెచ్చారన్నారు. సంక్షేమ ఫలాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రమంతటా బీఆర్ఎస్ గాలివీస్తున్నదని..మళ్లీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
అబద్ధాలు చెబుతున్న ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చల్లూరి రాంచందర్గౌడ్, ఉపాధ్యక్షుడు గుండా జగదీశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జుపాక కుమార్, జడ్పీటీసీ బొడ్డు సుధారాణి, ఏఎంసీ, ప్యాక్స్ చైర్మన్లు వెంకటేశ్, రాంరెడ్డి, రత్నాకర్, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, అల్లం దేవమ్మ, సర్పంచులు బాలసాని రవి, బోడకుంటి రమేశ్, మారం జలేందర్రెడ్డి, ఎంపీటీసీ పెద్దూరి హారికాభరత్కుమార్, మూగల సత్యం, ఒడ్డు రామస్వామి, ఎండీ రియాజ్, బాలసాని సత్యం, బిడారి తిరుపతి, తిరుమల్ చారి, కునమల్ల లింగయ్య, గాజుల సతీశ్, జీరెడ్డి మహేందర్రెడ్డి, రామగిరి మల్లేశ్, రంగు తిరుపతి, పాక వేణుగోపాల్, నాగరాజు, పూదరి రాజేందర్, కోల చరణ్, కూస మధుకర్, నస్పూరి నరసింహచారి, గాజుల భానేశ్, రామిల్ల వినోద్, బాబురాజ్, ఉపారపు సతీశ్ తదితరులు ఉన్నారు.
శాఖాపూర్ కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు కొత్త హరీశ్, మైనార్టీ నేత ఎండీ ఇమామ్, నాయకులు నేరేల్ల తిరుపతి, సంగేం అశోక్, ఎండీ రజాక్, ఎండీ సమీర్, తీర్థాల రఘు, రంగం సాయి, తనుగుల అశోక్, రంగం లక్ష్మణ్, తీర్థాల ప్రశాంత్, మడిగెల రవి, కొత్త విద్యాసాగర్, చౌటుపల్లి సత్యం, గర్శకుర్తి తిరుపతి, ఆవునూరి అనిల్, గర్వంధుల వెంకటేశ్, మిర్యాల తిరుపతి, తనుగుల లచ్చయ్య ఉన్నారు.