కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 30, 32, 38 డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్బంగా వినోద్కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేక సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై, బీఆర్ఎస్పై బురదజల్లుతూ పొద్దుగడుపుతున్నారని ఆరోపించారు.
దేశంలో ఇలాంటి దికుమాలిన ముఖ్యమంత్రిని ఎకడా చూడలేదన్నారు. నోరుతెరిస్తే బూతులతో సీఎం అనే హోదాను మరిచిపోయి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఒక ఉచిత బస్సు తప్ప మరో హామీని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి నియోజకవర్గంలో ముస్లింలు చదువుకునేందుకు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు.
ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్లను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, ఎంఐఎం ముస్లింలకు ఏనాడూ న్యాయం చేయలేదన్నారు. ముస్లింలు కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మి ఓటేసి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇప్పుడు నిధులు తెస్తామని చెప్పుకుంటున్న బండి సంజయ్ గత ఐదేళ్లలో ఎంపీగా ఉండి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. నగరంలో మరింత అభివృద్ది జరగాలంటే బీఆర్ఎస్ మేయర్ ఉండాలన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు నక్క పద్మ కృష్ణ. యూసుఫ్, మాధవి పాల్గొన్నారు.