కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 5 : గుజరాత్ అభివృద్ధి కావాలని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను అవమానించారంటూ మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ మండిపడ్డారు. కరీంనగర్లోని మీ సేవా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణేనని, కేంద్ర అవార్డుల్లో అత్యధికంగా మనకే వచ్చాయని గుర్తు చేశా రు. ఇవన్నీ మర్చిపోయి రేవంత్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
దేశాన్ని కొల్లగొట్టేది గుజరాత్ వ్యాపారులేనని, అలాంటి మోడల్ కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ తీరు గల్లీలో దోస్తి, ఢిల్లీలో కుస్తీ అన్నట్లుగా ఉందని విమర్శించారు. ఆ పొత్తును ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ పాలనలో పోటీ పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు రేవంత్రెడ్డి ప్రొసిడింగ్లు ఇచ్చి తానే ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడని దుయ్యబట్టారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగాల కోసం ఒక్క పరీక్ష నిర్వహించారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్గౌడ్, నాయకులు సూర్యశేఖర్ పాల్గొన్నారు.