తిమ్మాపూర్, మార్చి 9: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సోషల్ మీడియా వా రియర్స్ ఎకడికకడ ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ సూ చించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు రావుల రమేశ్ నివాసంలో శనివారం సా యంత్రం ఆయన మండలంలోని ముఖ్య కా ర్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బా లకిషన్ మాట్లాడారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఊహించని మార్పును ప్రజలకు గిఫ్టుగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
100 రోజుల్లో పచ్చని పంట పొలాలన్నీ ఎండిపోయి మార్పు కనిపిస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడొద్దని, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రశ్నించాలన్నారు. గత ప్ర భుత్వాన్ని బద్నాం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టడం లేదన్నా రు. నియోజకవర్గంలోని నీళ్లు మొత్తం మం త్రులు వారి నియోజకవర్గాలకు తరలించుకుపోయారని, మరో వారం పది రోజుల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రం కానుందన్నారు. ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించే కదనభేరి సభకు నియోజకవర్గం నుంచి 25 వేల మందిని తరలించనున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కు మార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చే యాలని పిలుపునిచ్చారు. మనం అధికారం లో లేకున్నా.. వినోద్కుమార్ ఎంపీగా ఉంటే మనకు కొండంత బలం అని అన్నా రు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీ రారెడ్డి, ఎంపీటీసీలు కవ్వంపల్లి పద్మ, కొమురయ్య, సంపత్రెడ్డి, నాయకులు పాశం అశో క్ రెడ్డి, దుండ్ర రాజయ్య, పొన్నం అనిల్ గౌ డ్, బోయిని తిరుపతి పాల్గొన్నారు.