రామగిరి, జూలై 4: సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. సింగరేణి ఆర్జీ-3 జీఎం కార్యాలయం ఎదుట అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు శనివారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నాయి.
ఈ మేరకు శనివారం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్యతో కలిసి ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత పదేళ్లలో తొలి సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థను ఎంత వేగంగా లాభాల బాటలోకి తీసుకవచ్చారో.. అంతే వేగంతో ఈ రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చిందని మండిపడ్డారు.
137 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం అధికారులు రోడ్డెక్కె పరిస్థితి వచ్చిందంటే.. ఆ పాపం కాంగ్రెస్దేనన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించకుంటే బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు పింగిళి సంపత్రెడ్డి, సెంట్రల్ కమిటీ నాయకులు దేవ శ్రీనివాస్, పొన్నం సదయ్య, కేశవరావు, శ్రీకాంత్రావు, బ్రాంచ్ కార్యదర్శి గండి శ్రీనివాస్గౌడ్, దాసరి మల్లేశ్, షరీఫ్, పూర్ణాకర్, వీవీ గౌడ్, వీరగోని సంతోష్గౌడ్, వెంకటేశం సుధాకర్, స్వామి, బీఆర్ఎస్ నాయకులు పూదరి సత్యనారాయణ, శెంకేసి రవీందర్, మ్యాదరవేని కుమార్, కాపురబోయిన భాస్కర్, శ్రీను, పిడుగు సురేశ్, రాఘవరెడ్డి, రాజశేఖర్రెడ్డి, సంజీవ్, సారంగి పాల్గొన్నారు.