జగిత్యాల రూరల్, డిసెంబర్ 3: దివ్యాంగుల అభ్యున్నతికి టీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కోరుట్ల, జగిత్యాల ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో జిల్లా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు.
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, కలెక్టర్ జీ రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఎకడా లేని విధంగా దివ్యాంగులకు 3016 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ అని పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు.
జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ, సర్కారు దివ్యాంగుల సంక్షేమంపై దృష్టి పెట్టిందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన దివ్యాంగులకు సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయగా 60 మందికి బ్యాటరీ వీల్ చైర్స్ పంపిణీ చేశారు. రక్తదానం చేసిన దివ్యాంగులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండి సత్యం పాల్గొన్నారు.