Lambadipalli | చిగురుమామిడి, ఏప్రిల్ 17 : ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం కిషన్ రెడ్డి (28) తన వ్యవసాయ బావి వద్ద పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు భావి వద్దకు ట్రాక్టర్ లో ధాన్యం తీసుకెళ్తుండగా ట్రాక్టర్ నడుపుతున్న కిషన్ రెడ్డి కాటం కుంట చెరువు వద్ద బొంద ఉన్న ప్రాంతాన్ని వద్దకు రాగానే ట్రాక్టర్ ముందు భాగం లేవడంతో ట్రాక్టర్ నడుపుతున్న కిషన్ రెడ్డి ఇంజన్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంటనే సర్పంచ్ సంపత్ రెడ్డికి సమాచారం అందించగా పోలీసులకు సమాచారం అందించాడు. మృతుడి తండ్రి లింగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్సై పృథ్విధర్ గౌడ్ తెలిపారు.