తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా పెద్దపల్లిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని చాటేలా పండుగలా దశాబ్ది వేడుకలను నిర్వహించాలని సూచించారు.
– కార్పొరేషన్/ కలెక్టరేట్, మే 28
కార్పొరేషన్/కలెక్టరేట్ మే 28: వచ్చే నెల 2నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను సర్వమతాల పండుగలా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు ప కడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్తో కలిసి వేడుకల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించాలని సర్కారు నిర్ణయించిందన్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా వారిగా నిర్వహించే ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఈ పదేళ్లల్లో సాధించిన ప్రగతి నివేదిక, చేపట్టిన పథకాలపై ఫ్లెక్సీలు, సక్సెస్ స్టోరీ, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలోని పభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలకరించాలని, గ్రామ సభలు ఏర్పా టు చేసి గ్రామాల్లో సాధించిన ప్రగతిని వివరించాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పదే ళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించే విధంగా కార్యక్రమాలను తీసుకోవాలన్నారు. కరీంనగర్కు మెడికల్ కళాశాల మంజూరుకావడం హర్షణీయమన్నారు. మానేరు డ్యాం వద్ద లేజర్లైట్ల షోను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 9న సంక్షేమ దినోత్సావా న్ని పురస్కరించుకొని కుల వృత్తిదారులకు రూ. లక్ష చొప్పున పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. జూన్ 17న కేబుల్ బ్రిడ్జి, ఆగస్టు 15న మానేరు రివర్ఫ్రంట్ను ప్రారంభించుకుందామన్నారు. సియోల్, చైనా తరువాత కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ అతిపెద్ద ఫౌంటెన్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మండుటెండల్లో కూడా 24గంటల నిరంతర కరెంట్ అం దిస్తున్న ఘనత ఒక తెలంగాణకే దకుతుందన్నారు. అలాగే మే 31న నిర్వహించనున్న టీటీ డీ తరహాలో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి భూమిపూజ చేస్తామన్నారు. ఆ తర్వాత నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణోత్సవానికి నగరవాసులు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూ న్ 2న అవతరణోత్సవం. 3న తెలంగాణ రైతు దినోత్సవం, 4న సురక్షా దినోత్సవం, 5న విద్యుత్ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊ రూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమం, 14న వైద్య ఆరో గ్యం, 15 నపల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20న విద్య, 21న ఆధ్యాత్మిక దినోత్సవం చివరగా జూన్ 22న అ మరుల సంస్మరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
vఈ నేపథ్యంలో విద్యుత్శాఖ పెద్ద ఎత్తున సంబురాలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ సునీల్రావు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సివిల్ సప్లయి కార్పొరేషన్ ఛైర్మన్ రవీందర్సింగ్, జిల్లా గ్రం థాలయ చైర్మన్ పొ న్నం అనిల్కుమార్గౌడ్, మేయర్ వై సునీల్ రా వు, అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.