తిమ్మాపూర్,ఏప్రిల్21: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామానికి చెందిన అలువాల అంకయ్య (60) అనే వ్యక్తి మంగళవారం ఉదయం కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. అదే రూట్లో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ సుభాష్ నగర్ వద్ద ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కరీంనగర్ హాస్పిటల్కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..
Harish rao | ఢిల్లీ పర్యటనకు హరీశ్..కాళేశ్వరం కేసులపై లాయర్లతో చర్చించేందుకే వెళ్లినట్టు వెల్లడి
Iran | ఐఆర్జీసీ గుప్పిట్లోకి ఇరాన్ పాలన?! ఉదారవాదులు పక్కకు.. పిడివాదులు తెరపైకి