మెట్పల్లి,అక్టోబర్ 26: కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నది. అందరికీ ముందుగానే జనంలోకి వెళ్లిన గులాబీ దళం, ప్రజలతో మమేకం అవుతుండగా, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు ఊరూరా మద్దతు పెరుగుతున్నది. గురువారం మల్లాపూర్ మండలం రేగుంట గ్రామస్తులు సంజయ్ కల్వకుంట్లకు జై కొట్టారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నామినేషన్ ఖర్చుల కోసం రూ.21వేలు పోగు చేశారు. మెట్పల్లిలోని వారి నివాసంలో డా. కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావును కలిశారు. శాలువా కప్పి సత్కరించారు.
అనంతరం నామినేషన్కు సంబంధించి డబ్బులను అందజేశారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, డా. కల్వకుంట్ల సంజయ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని రేగుంట గ్రామస్తులు ప్రకటించారు. ఇక్కడ గ్రామ సర్పంచి కుందేళ్ల నర్సయ్య, జడ్పీటీసీ సభ్యులు సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు తోట శ్రీనివాస్,మాజీ సర్పంచులు నిమ్మల భూమారెడ్డి, రం గు రామాగౌడ్, బీఆర్ఎస్ మహిళా విభాగం మం డల అధ్యక్షురాలు ఇనుగుర్తి సరిత, వీఎస్ఎస్ చైర్మ న్ రాజన్న, బీఆర్ఎస్ మండల శాఖ ఉపాధ్యక్షులు సురకంటి తిరుపతిరెడ్డి, నాయకులు గణవేని మల్లేశ్యాదవ్,మంద మల్లారెడ్డి పాల్గొన్నారు.
రేగుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండారి రాంచంద్రం గులాబీ గూటికి వచ్చారు. గురువారం మెట్పల్లిలోని సంజయ్ నివాసంలో మరో 30 మంది కార్యకర్తలతో పార్టీలో చేరగా, బీఆర్ఎస్ అభ్యర్థి డా.కల్వకుంట్ల సంజయ్ వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.