2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి. అయితే, పలు గ్రామాల ప్రజలకు మండల కేంద్రాలు సైతం దూరంగా ఉన్నాయని భావించిన కేసీఆర్ ప్రభుత్వం, కొత్తగా 17 మండలాలను ఏర్పాటు చేసింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు 5 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా మరో 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు 8 మున్సిపాలిటీలు ఉండగా, కొత్తగా మరో 8 మేజర్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాయి.