హుజూరాబాద్ టౌన్, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో గ్రామాలకు వాహనాల్లో తరలి వెళ్లారు. నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 305 మంది ప్రిసైడింగ్ అధికారులు, 305 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను ఎంపిక చేయగా, వీరికి సహాయంగా ఒక పోలీస్ను నియమించారు. నియోజకవర్గంలో ఎన్నికల విధులు నిర్వహించడానికి మొత్తం 1310 మంది సిబ్బందిని కేటాయించారు.
30 మంది సెక్టార్ ఆఫీసర్లు, 30 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేసి ఎన్నికలు సాఫీగా జరుగడానికి రిటర్నింగ్ అధికారి ఎస్ రాజు చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో 82 సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వీటి కోసం సుమారు 100 బస్సులు, జీపులు, కార్లను ఏర్పాటు చేశారు. ఒకొక రూటుకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
వీణవంకలో..
వీణవంక, నవంబర్ 29: మండలంలో నేడు జరుగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎంపీడీవో కె.శ్రీనివాస్ బుధవారం మండలంలోని కనపర్తిలో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ స్టేషన్, నర్సింగాపూర్లోని మహిళా పోలింగ్ కేంద్రం, వీణవంకలోని మోడల్ పోలింగ్ స్టేషన్లతో పాటు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలో మొత్తం 41,672 ఓటర్లు ఉండగా, 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మొత్తం 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, మంచినీటి సౌకర్యం, వైద్యం, టాయిలెట్స్తో పాటు ఓటర్లకు సహాయక కేంద్రాలు, దివ్యాంగుల కోసం వీల్చైర్లు, ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండలంలో పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
సమన్వయంతో పనిచేయాలి: డీఈవో
హుజూరాబాద్ టౌన్, నవంబర్ 29: డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. పీవోలు, ఏపీవోలతో సమన్వయం చేసుకుని పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్ తప్పనిసరిగా ఉండాలని, ఇందులో ఏఎన్ఎం, ఆశ వరర్ ఉండేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వులో ఉన్న వాటిని అందజేస్తామని చెప్పారు. పోలింగ్లో ఒక్కో అభ్యర్థికి ఒక్కో ఏజెంట్ ఉండాలని, ఇద్దరు రిజర్వు ఏజెంట్లను కూడా అనుమతించాలని తెలిపారు. ఏజెంట్లు తప్పనిసరిగా ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ అయి ఉండాలని తెలిపారు.
పోలింగ్ ముగిశాక కంట్రోల్ యూనిట్ బటన్ క్లోజ్ చేసుకోవాలన్నారు. పోలింగ్ ముగిశాక ఈవీఎంలు పోలింగ్ సిబ్బందితో కలిసి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్కు చేరుకోవాలని, అకడ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరచాలని సూచించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని, అలాగే ఓటు వేసేందుకు డబ్బులు అడిగే వారిపై కూడా కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సుమారు 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఇకడ అదనంగా బందోబస్తు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టామని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హకును వినియోగించుకునేలా 650 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి ఎస్ రాజు, నోడల్ అధికారులు విజయ్కుమార్, సమ్మయ్య, శ్రీనివాస్, ఏసీపీ ఎల్ జీవన్రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.