మానకొండూర్ రూరల్, డిసెంబర్ 31: మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి అందజేశారు. గోగూరి ఎల్లారెడ్డికి రూ.60 వేలు, నట్రాజ ఉమాపతికి రూ. 20 వేలు, గోగూరి విజయకు రూ.16 వేల చొప్పున చెక్కులను గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పంపిణీ చేశారు. చెక్కులను అందుకున్న లబ్ధిదారులు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్, బీఆర్ఎస్ బిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల కుమార స్వామి, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు నందగిరి మల్లయ్యచారి, నాయకులు బాలెంకి మల్లేశం, దాసరి భూమేశ్, కాసం లింగారెడ్డి, కాసం నర్సింహారెడ్డి, గోగూరి కమలాకర్ రెడ్డి, కొత్త వెంకట రెడ్డి, గోగూరి ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ గ్రామ మహిళా అధ్యక్షురాలు కైరి రజిత తదితరులు పాల్గొన్నారు.