Digital crop survey | చిగురుమామిడి, సెప్టెంబర్ 17 : వ్యవసాయ శాఖ సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్న రైతు వారి పంటల నమోదు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతీ రైతుకు సంబంధించిన పంట వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సర్వేయర్లకు సూచించారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం చిగురుమామిడిలో వరి పంటలను పరిశీలించారు. ఎరువుల యాజమాన్యంపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. చిరు పొట్ట దశలో ఉన్న వరి పంటలకు తగిన మోతాదులో యూరియా, పోటాష్ ఎరువులను విధిగా వినియోగించడం ద్వారా గింజ నాణ్యత బరువు రోగ నిరోధక శక్తి పెరుగుతాయన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు రైతులు పాటించాలన్నారు. వీరి వెంట మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్, ఏఈవో ఎండీ ఖలీల్ పాల్గొన్నారు.