ధర్మారం, అక్టోబర్ 28 : విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీపై నమ్మకం లేకనే ఆ ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుతున్నారన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారికి సముతమైన స్థానం కల్పిస్తామని మంత్రి అభయం ఇచ్చారు. శనివారం ఆయన ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఆయా గ్రామాల్లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ ఈ దేశానికి ఒరగబెట్టిందేమి లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన నయవంచన చేసిందని గుర్తు చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశం అధోగతి పాలయిందని విమర్శించారు. కానీ, స్వరాష్ట్రంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల కోసం సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి మేలు చేస్తున్నామని, అన్ని రంగాలను అభివృద్ధి చేశామని చెప్పారు. దేశంలోకెల్లా తమ ప్రభుత్వం 2 లక్షల 22 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవతో 18 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో యువతకు దొరికి ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
కానీ, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఉమ్మడి పాలన సమయంలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కేంద్రంలో కేవలం కార్పొరేట్ శక్తుల బాగు కోసం పని చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు బద్దం సుజాత, సాగంటి తార, కల్లెం గంగారెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ మేడవేని తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పాకాల రాజయ్య, జిల్లా సభ్యుడు ఎగ్గెల స్వామి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షు లు పూస్కూరు జితేందర్రావు, మిట్ట తిరుపతి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫి,
ఎంపీటీసీ సభ్యులు భూక్య సరిత రాజు నాయక్, మోతె సుజాత, ఉప సర్పంచులు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్, మెన్నేని వెంకటేశ్వర్ రావు, బొజ్జ మహిపాల్, మోతె అంజయ్య, నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ మెన్నేని నర్సింగారావు, గుండా సత్యనారాయణ రెడ్డి, బద్దం లింగారెడ్డి, బద్దం వెంకట్ రెడ్డి, గొడుగు మల్లయ్య, కనకం అంజయ్య, దుడ్డెల రమేశ్, అన్నమల్ల జలపతి, దుడ్డెల రవి, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రా వు, గూడూరి లక్ష్మణ్, బద్దం తిరుపతి రెడ్డి, రాంబాబు, అన్నెడ మహిపాల్ రెడ్డి, నోముల గంగారెడ్డి, దాసరి స్వామి, గుజ్జుల మహేందర్ రెడ్డి, పెట్టెం ఆంజనేయులు, గుజ్జుల వెంకట్రెడ్డి, అంజయ్య, జంగిలి గట్టు స్వామి ఉన్నారు.
కమ్మర్ఖాన్పేటకు చెందిన యువకులు బీజీపీ నుంచి చేరారు. పత్తిపాక ఎక్స్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో నర్సింగాపూర్కు చెందిన బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గొడుగు ప్రశాంత్ అధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు, బీజేపీకీ చెందిన పత్తిపాక గ్రామ ఉప సర్పంచ్ బండారి శ్రీనివాస్, బంజేరుపల్లికి చెందిన గడ్డం ప్రభాకర్ రెడ్డి పార్టీలో చేరారు. ఎర్రగుంటపల్లిలో బీజేపీ నుంచి గ్రామ ఉప సర్పంచ్ దేవి రజిత, బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు దేవి మల్లేశం, ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఊట్ల రాజేశ్, కాంగ్రెస్ నుంచి మాజీ ఉప సర్పంచ్ జీల్ల కనకయ్య, వార్డు సభ్యులు ఒడ్నాల శిరీష, వొడ్నాల సాగర్, ఏదుల్ల కవిత- మల్లేశ్తోపాటు సుమారు 50 మంది ఆ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు కొత్త మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆవుల మల్లేశం అధ్వర్యంలో మంత్రి ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖిలావనపర్తిలో మంత్రి పార్టి కార్యాలయాన్ని ప్రారంభించగా, ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, బీజేపీల నుంచి మంత్రి సమక్షంలో చేరారు.