తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 5: దళితుల అభివృద్ధి, ఆత్మగౌరవం సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మండలంలోని పోలంపల్లిలో ఆయన సోమవారం పర్యటించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ చేశారు. అలాగే ఖమ్మం కృష్ణ అనే యువకుడికి దళితబంధు ద్వారా మంజూరైన టెంట్హౌస్ యూనిట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు మారినా దళితుల రాత మారలేదని, దళితుల రాత మా ర్చేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.
దళితులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్నా రు. పోలంపల్లి గ్రామానికి చే సిన అభివృద్ధిని గుర్తు చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు డ ప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో స ర్పంచ్ బొజ్జ తిరుపతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మ న్ పాశం అశోక్రెడ్డి, తోట మధు, ఎలుక ఆంజనేయులు, బోయిని తిరుపతి ఉన్నారు.