కొత్తపల్లి, నవంబర్ 10 : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనమే వస్తుందని, బీఆర్ఎస్ గెలిస్తేనే గొప్పగా అభివృద్ధి చెందుతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో టిక్కెట్లు అమ్ముకుంటున్న చరిత్ర రేవంత్రెడ్డిదని, భూకబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపట్ల కరీంనగర్ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సం జయ్ ఏనాడైనా మీ ఊరికి వచ్చి అభివృద్ధి పనులు చేశాడా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు మండలంలోని కమాన్పూర్, బద్దిపల్లి గ్రామాల్లో విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. వందలాదిగా ప్రజలు వెంటరాగా, ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించారు. తమ ఓటు కారు గుర్తుకే అంటూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ చేతులను బలోపేతం చేయాలని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనన్నారు.
ప్రజలు ఓ టు వేసే ముందు సమైక్యపాలనలో జరిగిన అన్యాయాన్ని, కరెంట్ కోసం, సాగునీటి కోసం కష్టపడ్డ రోజులను గుర్తుంచుకొని ఓటు వేయాలని కోరా రు. కాంగ్రెస్ హయాంలో పింఛను ఇవ్వలేదని, కొత్తగా పింఛన్ కావాలంటే మరో లబ్ధిదారు చావుకోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదన్నా రు. కరెంటు, సాగు, తాగు నీరు లేక, అభివృద్ధి కాక అరిగోసపడ్డామన్నారు. స్వరాష్ట్రంలో అభివృ ద్ధి సాధించిన పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టాలని తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటై కేసీఆర్ను ఓడగోట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
ఇకడి సంపదను దోచుకుని రాష్ర్టాన్ని గుడ్డి దీపం చేసేందుకు యత్నిస్తున్నారని, ఆంధ్రో ళ్ళ మాటలు నమ్మి మోసపోతే మన నీళ్ళు, నిధు లు దోచుకుంటారని చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందామని, అధికారాన్ని ఢిల్లీ పాలకులు, ఆంద్రోళ్ళ చేతుల్లో పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకుంటే రాష్ర్టా న్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చివేస్తారన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్దని, వారి మాటలు నమ్మి మన బిడ్డల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవదని సూచించారు. మరోసారి తనను గెలిపిస్తే కరీంనగర్ను మ రింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నా రు. ప్రచారంలో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్, సర్పంచ్లు జిను క సంపత్, రాచమల్ల మధు, బీఆర్ఎస్ నాయకులు పిట్టల రవీందర్, తిరుపతి పాల్గొన్నారు.