శంకరపట్నం, సెప్టెంబర్ 20: కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర సాంస్కతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో అభివృద్ధికి దూరమైన మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్నింటా ముందునిలిపామని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి పనిచేసే పార్టీకే పట్టంగట్టాలని పిలపునిచ్చారు.
బుధవారం శంకరపట్నంలోని బీఆర్ఎస్ ఆఫీసులో ముత్తారం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్వై నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు.
పార్టీలో పనిచేసేవారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ మానకొండూర్లో బీఆర్ఎస్ పటిష్టానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఏఎంసీ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు అంతం తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల రాజయ్య, నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అలీమొద్దీన్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని చెప్పారు. పార్టీలో పనిచేసేవారికి పదవుల కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. కొత్తగా చేరిన వారు మాట్లాడుతూ మానకొండూర్లో బీఆర్ఎస్ పటిష్టానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ఏఎంసీ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు అంతం తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ పంజాల రాజయ్య, నాయకులు ఉమ్మెంతల సతీశ్రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు అలీమొద్దీన్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.