కలెక్టరేట్, మే 12: వయోవృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి, సముచిత గౌరవమి వ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ సర్కారు అభాగ్యులకు అండగా ఉంటున్నదని, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక శాఖ ను ఏర్పాటు చేసిందని చెప్పారు. కరీంనగర్ జడ్పీ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను రాష్ట్ర పౌరసరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విరమణ పొందిన వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి, కాలక్షేపం చేసేందుకు కరీంనగర్లో డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయ డం అభినందనీయన్నారు. వృద్ధాప్యం శరీరానికి మాత్రమేనని, మనస్సుకు కాదని చెప్పారు. వృద్ధు లు తమ జీవితంలోని అనుభవాలు, సలహాలు, సూచనలు నేటి తరానికి మార్గనిర్దేశం చేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సర్కారు అమలు చేస్తున్న పథకాలను చూసి అండ గా నిలువాలన్నారు. వయోవృద్ధులు డే కేర్ సెంటర్ను రోజు సందర్శించి సంతోషంగా గడుపాలని కోరారు. మంత్రి గంగుల మాట్లాడుతూ, మనిషికి ఏకాంతమే పెద్ద జబ్బు అన్నారు.
ఈ రోగం మనిషికి అర్ధాయుష్షునిస్తే, ఆత్మీయుల కలయికతో ఆయుష్షును పెంచుతుందన్నారు. డే కేర్ సెంటర్లో జిమ్, పుస్తకాలు, యోగా, తదితర శారీరక, మానసిక ఆహ్లాదాన్నిచ్చేలా వసతులు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. సమాజానికి వివిధ రంగాల్లో ఎంతో సేవ చేసిన వారిని గౌరవించడం, పూ జించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అంతకుముందు సీనియర్ సిటిజన్, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన రెస్క్యూ వాహనాన్ని, ఇదే భవనంలో ఏర్పాటు చేసిన వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించా రు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజ య, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్నేతకాని, మేయర్ సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ వీసుబ్బారాయుడు, జడ్పీ సీఈవో సీహెచ్ ప్రియాంక, డీడబ్ల్యూవో సబిత, డీఎంహెచ్వో లలితాదేవి, ఆర్డీవో ఆనంద్కుమార్, కార్పొరేటర్ దిండిగాల మహేశ్, సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్రెడ్డి, ఫోరం జిల్లా అధ్యక్షుడు సముద్రాల జనార్దన్రావు, పెండ్యాల కేశవరెడ్డి పాల్గొన్నారు.