కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్గాల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశాయి. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశాయి. సీఎం ఆలోచన దేశానికే మార్గదర్శకమని ప్రముఖులు కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప ప్రకటన చేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారత జాతి గర్వంగా తలెత్తుకునేలా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడని, ఆయన పేరు సచివాలయానికి పెట్టడం మనందరికీ గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘జై భీమ్.. జైజై కేసీఆర్’ అంటూ నినదించారు. ఇదే స్ఫూర్తితో ఢిల్లీలోని కొత్త పార్లమెంట్కూ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హుజూరాబాద్టౌన్: సీఎం కేసీఆర్, అంబేద్కర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు
యావత్ జాతికి గర్వకారణం
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణం. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం దేశానికే మార్గదర్శనం. దళిత, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును అత్యాధునిక హంగులతో నిర్మించిన సచివాలయానికి పెట్టడంతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నిర్ణయంతో దళిత, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెరిగింది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్
పార్లమెంట్కూ పేరు పెట్టాలి
కొత్త సచివాలయానికి బీఆర్ అంబేదర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విజయం. అన్ని వర్గాల సమానత్వం కోసం పోరాడిన మహనీయుడి పేరును అత్యాధునిక సచివాలయానికి పెట్టడం నిజంగా యావత్ జాతికి గర్వకారణం. సీఎం కేసీఆర్ మాటల్లో కాదు, చేతల్లో తానెంటో దేశానికి చాటిచెప్పారు. తాజా నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విషయంలో తెలంగాణ మరోసారి దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్రం కూడా తన స్ఫూర్తిని చాటాలి. కొత్త పార్లమెంటు భవనానికి అంబేదర్ పేరు పెట్టాలి.
– మంత్రి గంగుల కమలాకర్
మంథని/ ఓదెల/ కోల్సిటీ, సెప్టెంబర్ 15 : కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ వర్గాల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశాయి. పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశాయి. సీఎం ఆలోచన దేశానికే మార్గదర్శకమని ప్రముఖులు కొనియాడారు. చరిత్రలో నిలిచిపోయేలా గొప్ప ప్రకటన చేశారని సంతోషం వ్యక్తం చేశారు. భారత జాతి గర్వంగా తలెత్తుకునేలా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడని, ఆయన పేరు సచివాలయానికి పెట్టడం మనందరికీ గర్వకారణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘జై భీమ్.. జైజై కేసీఆర్’ అంటూ నినదించారు. ఇదే స్ఫూర్తితో ఢిల్లీలోని కొత్త పార్లమెంట్కూ అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నిర్ణయంతోనైనా కేంద్రం దిగిరావాలి
రాష్ట్ర సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెడతామని సాహసోపేత నిర్ణయం తీసుకోవడం కేవలం కేసీఆర్కే సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవన్కు అంబేద్కర్ పేరు పెట్టాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏనాడూ అంబేద్కర్ ఆశయాలను గౌరవించలేదు. ఆ పార్టీకి నిజంగా చిత్తశుధ్ధి ఉంటే పార్లమెంట్కు ఆయన నామకరణం చేయాలి. ఇదే డిమాండ్తో అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెటడ్డం సంతోషంగా ఉంది.
– బొంకూరి కైలాసం, మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు (పెద్దపల్లిటౌన్)
అంబేద్కర్కు సముచిత గౌరవం
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఇదే విధంగా ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. రాష్ట్ర సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడం సాధ్యమైనప్పుడు పార్లమెంట్కు పెట్టడం ఎందుకు సాధ్యం కాదు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్న ఈ తరుణంలో అంబేద్కర్కు సముచిత గౌరవం దక్కింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– నకుమల్ల లక్ష్మీనారాయణ, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
దేశానికే ఆదర్శం
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతామని సీఎం కేసీఆర్ నిర్ణయించడం దేశానికే ఆదర్శం. రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. అంబేద్కర్కు సరైన గౌరవాన్ని ఇచ్చిన సీఎంను దళితలు ఎప్పుడూ మర్చిపోరు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకం ద్వారా దళితుల సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు మెచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్కు మంచి పేరున్నది. ఆ పేరును మరోసారి సార్థకత చేసుకున్నారు. ఇందుకు దళితులమంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం.
– మద్దెల శ్రీనివాస్, మాల సంఘ అధ్యక్షుడు, కొలనూర్ (ఓదెల)
కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలి
రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదర్శంగా తీసుకొని పార్లమెంట్కు అంబేద్కర్ పేరుపెట్టాలి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం సీఎం కేసీఆర్కే దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం చేస్తున్న అనేక పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సీఎం కేసీఆర్ నిర్ణయాలు దేశ చరిత్రనే మార్చే విధంగా ఉంటాయి. ఆయనను ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ర్టాల్లోని సచివాలయాలకు అంబేద్కర్ పేరు పెట్టాలి.
– ఎంపీపీ బూర వజ్రమ్మ, వేములవాడ
చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కేసీఆర్కు దళితులపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ప్రధానమంత్రి మోదీ పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
– మ్యాకల రవి, వేములవాడ జడ్పీటీసీ
దేశానికే ఆదర్శంగా నిలిపారు..
ప్రపంచ మేధావి బీఆర్ అంబేదర్ పేరు రాష్ట్రంలోని కొత్త సెక్రటేరియట్కు పెట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన పాలనలో అనతి కాలంలోనే దేశానికే తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచింది. తాజాగా, ఈ నిర్ణయంతో దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపారు. ఇలాగే ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పెట్టాలి.
– దావ వసంత, జడ్పీ చైర్పర్సన్, జగిత్యాల
మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్
అంబేద్కర్ అలోచనా విధానానికి కేరాఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం. అత్యంత వెనుకబడిన దళితజాతి మహోన్నతి, అభ్యున్నతి, వికాసానికి అంబేద్కర్ ఏం ఆలోచించారో వాటిని తూచ తప్పకుండా అమలు పరుస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఅర్. ఇందుకు నిదర్శనమే దళితబంధు పథకం. దేశంలోనే ఇది మహోన్నతమైంది. ఇది ఎవరూ చేయని సాహసం. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమంటే ప్రతిరోజూ ఆయనను తలుచుకోవడమే. తెలంగాణ రాష్ట్ర అకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం బాబా సాహెబ్ అంబేద్కర్ అయితే, ఆయన ఆలోచనా విధానాన్ని సాకారం చేసిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఅర్.
– మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దళితులు గర్వంగా తలెత్తుకునేలా..
కొత్తగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెడుతామని ప్రకటించి సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. మహనీయుడు, ప్రపంచ మేధావి పేరును పెట్టడం హర్షనీయం. యావత్ తెలంగాణలో ఉన్న దళితులు గర్వంగా తలెత్తుకునేలా ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టినట్లుగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు పెట్టి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
– చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఆత్మగౌరవం పెంచే నిర్ణయం
కొత్త సచివాలయానికి అంబేద్కర్ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న చారిత్రాత్మకం. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఉన్నది. తెలంగాణ దళిత సమాజం పక్షాన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పటికే దళితబంధుతో సీఎం కేసీఆర్ దళితుల బతుకులనే సమూలంగా మార్చుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి మహనీయుడు అంబేద్కర్ పేరు పెడతామని చెప్పి దేశ చరిత్రలో తెలంగాణ పేరు నిలిచేలా చేశారు.
– ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ (హుజూరాబాద్టౌన్)
దళితుల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చరిత్ర ఉన్నంత వరకు దళితులు ముఖ్యమంత్రిని మరచిపోరు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని సీఎం కేసీఆర్ ఎప్పుడూ గుర్తు చేసేవారు. అంతే కాకుండా ఆ మహనీయుడిని ఎప్పుడూ స్మరించుకునేలా భవనానికి పేరు పెడతామని చెప్పి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏ సమాధానం చెబుతారో చూడాలి. పార్లమెంట్ భవనానికి కూడా అంబేద్కర్ పెట్టి బీజేపీ దళితుల పట్ల ప్రేమ ఉంటే నిరూపించుకోవాలి.
-పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీపీ, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా
దళితులమంతా రుణపడి ఉంటాం
కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ గొప్ప మహనీయుడు. నిజంగా ఆది నుంచి దళితుల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న ప్రత్యేక గౌరవానికి నిదర్శనం. ఈ నిర్ణయంతో దళితుల ఆత్మాభిమానం మరింత పెంచారు. బీజేపీ నాయకులు రోజుకో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి మాట మీద నిలబడ్డారు. మరి బీజేపీ నాయకులు కూడా ఢిల్లీలో నిర్మించే కొత్త పార్లమెంట్ భవనానికి భేషరతుగా అంబేద్కర్ పేరు పెట్టాలి. లేకుంటే రాష్ట్రంలో వారిని తిరగనివ్వం. దళితులమంతా ఏకమై బీజేపీ నాయకులను తరిమి కొడతాం.
-కత్తెరపాక ఉమ కొండయ్య, జడ్పీటీసీ బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా