రామడుగు, అక్టోబర్ 20: పదేండ్లలోనే రాష్ర్టాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్కు ఓటేసి అండగా నిలుద్దామని చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఈ మట్టి బిడ్డగా మీ మధ్యన ఉంటానని, తనను ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చా రు. కారు గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రామడుగు మండలం వెదిర, దేశరాజ్పల్లి, కొక్కెరకుంట, వన్నారం గ్రా మాల్లో శుక్రవారం ఆయన ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేండ్లలో వందల కోట్ల నిధులను తెచ్చి చొప్పదండి నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశానన్నారు.
ఉమ్మడి రాష్ట్రం లో నాటి చివరి ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారని, అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందిపడే కాలమొస్తదని ఎగతాళి చేశారని గుర్తు చేశారు. ఇగ నేటి కాంగ్రెస్ అధ్యక్షుడైతే రైతులకు మూడు గంటల కరెంటు సరిపోదా..? అని రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అరవై ఏండ్లు పాలించిన తెలంగాణను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. కానీ, కొట్లా డి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని, బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి అయిందని కొనియాడారు. కర్ణాటక ఎన్నికల్లో ఐదు గ్యారంటీల పేరు తో మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించలేక చేతులెత్తేసిందన్నారు.
అక్కడి రైతులకు ఐదు గంటల కరెంటు మాత్రమే ఇస్తామని, అదనంగా ఒక్క నిమిషం కూడా ఇవ్వలేమని కర్ణాటక విద్యుత్శాఖ మంత్రి చెబుతున్నాడన్నారు. కేవలం మోసం చేసి గద్దెనెక్కేందుకే మా యల మరాఠీలు మళ్లీ పల్లెలకు వస్తున్నారని విమర్శించారు. పండుగలప్పుడు మాత్రమే పగటి వేషగాళ్లు వస్తారని, ఐదేండ్ల తరువాత మిమ్మల్ని మో సం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మితే గోస పడుతామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కలిగేటి కవితాలక్ష్మణ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, సర్పంచులు నాగుల సంగీతారాజశేఖర్గౌడ్, ఉ మ్మెంతల అభిషేక్రెడ్డి, జాడి లక్ష్మీరాజమల్లు, ఎం పీటీసీలు తొరికొండ అనిల్కుమార్, వంచ మ హేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, గోపాల్రావుపేట ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ జూపాక కరుణాకర్, జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, నాయకులు రవీందర్రావు, ముర ళి, సత్యనారాయణరెడ్డి, ఎల్కపెల్లి లచ్చయ్య, గజ్జెల ఆనందరావు, మ్యాన మురళీధర్, బత్తిని తిరుపతిగౌడ్, కొడిమ్యాల రాజేశం పాల్గొన్నారు.