Congress violence | హుజురాబాద్, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో కాంగ్రెస్ గుండా గిరి చేసింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పన్నాగాలు పన్నింది. 30 వార్డులకు గాను కేవలం 10 కౌన్సిలర్లే గెలుచుకున్న కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యాత్నించారు. కౌంటింగ్ కేంద్రం నుంచే ముగ్గురు స్వతంత్ర, ఒక ఏఐఎఫ్బీ కౌన్సలర్ను క్యాంపుకు తరలించారు.
దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావును పోలీసులు అదుపులోకు తీసుకుని వదిలిపెట్టారు. మెజార్టీ రాకున్నా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేయడంతోనే ఈ ఘటన జరిగినట్టు అక్కడ చర్చ జరుగుతోంది.