ధాన్యం కొనుగోళ్ల వేళ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం అమ్మాలా.. వద్దా..? అనే మీమాంస కనిపిస్తున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద 500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ స్పష్టత రాలేదు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ప్రస్తుత సీజన్లో కొనే ధాన్యానికి బోనస్ వర్తింపజేస్తారా..? లేదా..? అన్న దానిపై క్లారిటీ ఇవ్వక పోవడంతో ఉత్కంఠ నెలకొన్నది. ఏదేమైనా ఈ విషయంలో స్పందించాలని రైతులోకం కోరుతున్నది.
– కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కరీంనగర్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంట నే ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రైతు భరోసా కింద ఏటా రై తులకు, కౌలు రైతులకూ ఎకరానికి 15వేలు, వ్య వసాయ కూలీలకు 12వేలు, వరి పంటలకు క్విం టాల్కు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. మిగిలిన హామీలను పక్కన పెడితే, ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుత సీజన్లో కొనుగోలుచేసే ధాన్యానికి బోనస్ వర్తింప జేస్తారా..? లేదా అన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మేనిఫెస్టోను ప్రకటించిన విష యం తెలిసిందే.
వివిధ వర్గాలకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ.. ప్రధానంగా 6 గ్యారెంటీలను మాత్ర మే అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఎన్నికలకు ముందే పదే పదే ప్రకటించడంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. చెప్పిన ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా ఒకటి. ఈ రైతు భరోసా కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు, వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని తన మ్యానిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇ చ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా హామీలను అమలు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హామీలను వంద రోజుల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రైతుల అంశాలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకపోవడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నిజానికి ఎప్పటి మాదిరిగానే ప్యాక్స్, ఐకేపీ, మెప్మా, డీసీఎంస్ల ద్వారా కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నా రు. ఈ ఏర్పాట్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసినప్పటికీ మధ్యలో ఎన్నికలు రావడంతో ఈ సారి ధాన్యం సేకరణ కూడా కొంత నెమ్మదిగానే కొనసాగుతున్నది. గతేడాది ఈ సీజన్లో ఈ సమయానికి దాదాపు 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సారి 33 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు జరిగిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ధాన్యం ఫైన్ రకాలకు క్వింటాల్కు 2,203, సాధారణ రకాలకు 2,183 మద్దతు ధర ఉంది. తాము అధికారంలో కి రాగానే కొనుగోలు చేసే ధాన్యానికి క్వింటాలుకు 500 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుత సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు గత నవంబర్ నుంచే ప్రారంభం కాగా, ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నా యి. అయితే.. చాలా మంది రైతులు తమ ధాన్యా న్ని విక్రయించకుండా.. వారి వద్దే ఉంచుకుంటున్నారు. బోనస్ విషయంలో ప్రభుత్వం నుంచి క్లారి టీ లేకపోవడం వల్లే.. తాము ధాన్యం అమ్మాలా..? లేక వద్దా..? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు రైతులు.
నిజానికి ఈ సీజన్లో విక్రయించిన అందరికి బోనస్ వర్తింప జేస్తారా..? లేక? ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రమే వర్తింప జేస్తారా? మొ త్తానికి ఈ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ వర్తింప జేస్తారా..? లేదా..? అన్న దానిపై స్పష్టత ఇస్తే తాము ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు రైతులు. అలా కాకుండా ఏదైనా ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మాత్రమే కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ వర్తింప చేస్తామంటూ… ప్రభుత్వం ఆదేశా లు ఇస్తుందా..? అన్న అనుమానాలున్నాయి. అదే జరిగితే.. తాము ఇప్పుడు విక్రయించుకోవడం వల్ల బోనస్ నష్ట పోతామన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తున్నది.
ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంపు హామీలను అమలు చేస్తున్నట్లుగా చెప్పిన ప్రభుత్వం.. ఆరు గ్యారెంటీల్లో మిగిలిన హామీలను మాత్రం వం ద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన మాటలను చూస్తే.. ఈ సారి బోనస్ ఉంటుందా..? లేదా..? అన్న అనుమానాలు రైతులను వెంటాడుతున్నా యి. గత గణాంకాలను చూస్తే.. ఏటా గత ప్రభు త్వం వివిధ సంస్థల ద్వారా దాదాపు కోటి మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మద్దతు ధర ప్రకారం చూసినా ఏటా 22వేల కోట్లను ధాన్యం కొనేందుకు రైతులకు చెల్లించింది.
ఇప్పుడు క్వింటాలుకు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తే.. కాంగ్రె స్ ప్రభుత్వం ఏటా ఐదువేల కోట్లను రైతులకు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ప్రభుత్వం ఏటా భారం పడే ఐదువేల కోట్లను చెల్లింపునకు ముందుకు వెళ్తుందా..? లేదా..? అన్న ప్రశ్నలు రైతుల్లో తలెత్తుతున్నాయి. ఏదేమైనా ఈవిషయంలో క్లారిటీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు క్లారిటీ ఇస్తుందా..? లేక దాట వేత దోరణితో ముందుకు వెళ్తుందా అన్నది మున్ముందు తేలుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మాది తాడూరు. నాకు మూడెకరల పొలం ఉన్నది. వరి పంట ఏసిన. ఈ సారి 67 క్వింటాళ్ల వడ్లు పండినయ్. మొన్ననే మా ఊరి కొనుగోలు కేంద్రంలో అమ్మిన. బోనస్ గురించి చెబుతరు గావచ్చని నాలుగైదు రోజులు అమ్మకుండా ఆపుదామని జూసిన. కానీ, కొనుగోలు కేంద్రం మూసేత్తమన్నరు. అందుకే అమ్మిన. ఇంకా అమ్మిన పైసలు రాలేదు. దాంతో బోనస్ ఇస్తరో లేదో చూడాలె. అక్కడక్కడ సానా మంది బోనస్పై ప్రభుత్వం ఏమిచెప్తుందోనని చూత్తున్రు. వండ్లతోపాటు బోనస్ ఇస్తరో చూడాలె.
– గోగు శ్రీనివాస్, రైతు, తాడూరు, తంగళ్లపల్లి మండలం
నేడు వడ్లు అమ్ముకున్న. యాంసంగి మొదలు పెట్టిన. మాకు అమ్మిన వండ్లకు కూడా బోనస్ ఇత్తే బాగుటుంది. కొనుగోలు కేంద్రంలోనే అమ్మినం. ఆ లెక్కలు సర్కారు వద్ద ఉంటయి. మేము అమ్మిదెంత? మాకు వచ్చిన డబ్బులెంత? అన్నది ఉంటది. ఆ లెక్కన బోనస్ ఇత్తరు గావచ్చని మా రైతులమంతా అనుకుంటున్నం. అట్లనే యాసంగి మొదలైంది. రైతుబంధు కూడా ఇత్తే మంచిగుంటది. నిజంగా అయితే ఎన్నికలప్పుడు డిసెంబర్ 9న రైతు బంధు వేస్తమన్నరు. కానీ, ఇప్పుడేమి చెప్పడం లేదు. అవి ఇవి కలపి వేస్తే.. మాకు ఉపయోగపడుతాయి.
-కోసిని మల్లేశం, రైతు, తాడూరు (తంగళ్లపల్లి మండలం)