KARIMNAGAR |కలెక్టరేట్, మార్చి 29: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. అశాఖ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఇటీవల కాలంలో వస్తున్న విమర్శలతో పాటుగా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వయంగా కలెక్టరే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల కలెక్టర్ తీసుకున్న చర్యలు దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయన్న చర్చ ఆ శాఖలో ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. వివరాల్లోకి వెళితే… గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఈ శాఖలో గత కొద్దినెలలుగా నిర్లక్ష్యం రాజ్యమేలుగుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రుణాలందిస్తూ, వారి నుంచి తిరిగి వసూలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్ళ నుంచి ఇందుకనుగుణంగానే ముందుకుసాగినా ఇటీవలి కాలంలో ఆశాఖ యంత్రాంగం కార్యక్రమాల అమలుపై పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లింకేజీలో రోజురోజుకు వెనుకబడుతున్న నేపథ్యంలో డిఆర్ డిఏ పనితీరుపై శుక్రవారం ఆసంస్థ కార్యాలయమైనా స్వశక్తి కళాశాలలో సంబంధితే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాలకు అందించే రుణాలు, బీమా సౌకర్యాలతో పాటు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లు కుట్టేందుకు ప్రణాళిక రూపకల్పన, పెన్షన్లపై సంబంధిత అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహించటం లేదని గుర్తించిన కలెక్టర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఆ శాఖ సిబ్బంది ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది.
ఈ శాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమాచారమివ్వాల్సి ఉండగా, ఎలాంటి నివేధికలు పంపటం లేదని మండిపడిన కలెక్టర్.. ఆ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న టి సర్స్ వాట్సప్ గ్రూప్ పాటు ఉపాధి హామీ సిబ్బంది వాట్సప్ గ్రూప్లో తన నెంబర్ చేర్పించినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం రలైన వారికి పధకాలు వర్తింపజేయటంలో కూడా పట్టింపులేనట్లు వ్యవహరిస్తుండటాన్ని గుర్తించి సంబంధిత అధికారులను తీవ్రంగా మందలించడంతో పాటుగా పని తీరుమారు మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించినటుగా తెలుస్తోంది. ఓల్డేజ్, స్పాజీ పెన్షన్లపై ప్రత్యేకంగా ఆరా తీయగా, 350 స్పాజ్ పెన్షన్లు పెండింగ్లో ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. నివ్వరపోవడంతో పాటుగా… మహిళా సంఘాల్లోని సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద పెన్షన్ మంజూరీ కోసం వచ్చిన దరఖాస్తులు కూడా నామమాత్రంగానే ఉండడంతో అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకు లింకేజీల్లో గత ఎనిమిదేళ్ల నుంచి వరుసగా మొదటి అయిదు స్థానాల్లో ఉన్న జిల్లా… ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం రోజు రోజుకు పడిపోతున్న తిరుపై సంబందితే అధికారులను ప్రశ్నించటంతో అధికారులు మిన్నకుండిపోగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు చెల్లించాల్సిన కమీషన్ కూడా పెండింగ్లో ఉండగా, బ్యాంకు లింకేజీలో లక్ష్యం దాటినందుకు సిర్ఫ్ చేత ఆవార్డు అందుకున్న సందర్భంలో కూడా కనీస సమాచారం ఇవ్వకపోవటం పట్ల సంబంధిత అధికారులపై మండిపడ్డట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు గుండె కాయ అయిన ఈ సంస్థలోని అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయలేమితోనే ఇదంతా జరుగుతుందని, ఈసారి ఐకెపీకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పంచతుండగా, ఇలాగే వ్యవహరిస్తే వాటి నిర్వహణపై కూడా ప్రభావం పడుతుందని, నిర్లక్ష్యపు జాడ్యం విడనాడితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా క్షేత్రస్థాయికి వెళ్తాయని హితబోధ చేసినట్లు భోగట్ట, మరోసారి పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాలేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో, కలెక్టర్ దృష్టి సారించడంతో ఇక నుంచైనా ఆ శాఖలో కొంతమంది అధికారులు చేస్తున్న ఎత్తగానికి చెక్ పడి, పూర్వవైభవ దిశగా ఆశాఖ ముందుకు సాగుతుందేమోననే అభిప్రాయాలు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిలో వ్యక్తమవుతున్నాయి.