రామడుగు, జూన్ 7: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేరొన్నారు. రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులోని గాయత్రి పంప్ హౌస్ను బుధవారం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ చైతన్య, జ్యోతిష్మతి, వాగ్దేవి, విట్స్, హుజూరాబాద్ సింగాపూర్కు చెందిన కిడ్స్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి సుమారు 650 మంది విద్యార్థులతో కలిసి గాయత్రి పంప్ హౌస్ను కలెక్టర్ సందర్శించారు. తొలుత డెలివరీ సిస్టర్న్ వద్ద జలాలను ఎత్తిపోసే విధానాన్ని విద్యార్థులతో కలిసి పరిశీలించారు. అనంతరం వాహనాల్లో సొరంగ మార్గం ద్వారా సుమారు కిలోమీటర్ దూ రంలో భూగర్భంలో ఉన్న సర్వీస్ బే వద్దకు చేరుకున్నారు. అకడి నుంచి మెట్ల ద్వారా నిర్మించిన బాహుబలి మోటార్ల వద్దకు చేరుకొని విద్యార్థులకు చూపించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ; ప్రపంచ వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ముఖ్యం గా తెలంగాణ ప్రాంతం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుందని, అయినప్పటికీ గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పాతాళంలో ఉన్న జలాలను శిఖరం పైకి తీసుకొచ్చారన్నారు. ఇది ఇంజినీర్ల ప్రతిభకు నిదర్శనమన్నారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, తహసిల్దార్, రాజకుమార్, గాయత్రి పంప్ హౌస్,డీఈఈ రాంప్రదీప్, ఏఈలు రమేశ్, వెంకటేశ్, ఆరు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తదితరులుఉన్నారు.