పెద్దపల్లి రూరల్, జనవరి 4: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా చేపట్టిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని, ఇది పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తుందని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.
గురువారం పెద్దపల్లి మండలం అప్పన్నపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంపై సంబంధిత అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. కాసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పలు రకాల అంశాలపై కార్యక్రమంలో ఎంఈవో సురేందర్కుమార్, హెచ్ఎం పురుషోత్తం, సీఆర్పీలు ఉన్నారు.