కట్టంగూర్, జూలై 29 : ప్రతి ఇంట్లో ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఎంపీఓ స్వరూపారాణి అన్నారు. వీబీ జీ-రామ్ జీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్పంచ్ మక్కామల శ్యామల శేఖర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడుతూ వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. వామ్ ఫండ్స్ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులు, గ్రామాభివృద్ధికి సంబంధ ఇంచిన పలు అంశాలపై గ్రామసభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కడెం రాంమోహన్, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, వార్డు సభ్యులు అయితగోని సైదులు, శ్రీరామ సంధ్య, ఏనుగు సైదులు, ఏకుల సుజాత, ముశం లావణ్య, కానుగు సైదమ్మ, కల్లెం నాగేశ్వర్ రావు, కానుగు శ్రీను, అంగన్ వాడీ, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.