కమాన్చౌరస్తా, జనవరి 20: పేదలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. నగరంలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శుక్రవారం తెల్లవారుజామున ఆయన పర్యటించారు. ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేస్తూ ఆదుకుంటున్నారని కొనియాడారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సిల్ల శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ జాప శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, కంది రాంచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ కార్యదర్శి నాయిని వెంకట్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, నాయకులు జాప లక్ష్మారెడ్డి, దాసం కమలాకర్, లంక రవి, సల్ల మహేందర్, జాప రవీందర్ రెడ్డి, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు.