కార్పొరేషన్, ఏప్రిల్ 7: ‘రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, కరీంనగర్ ప్రగతి, సింగరేణి కొలువులపై చర్చకు మేం రెడీ. బండి సంజయ్ నువ్వు సిద్ధమేనా..? సమయం నువ్వు చెప్పినా సరే. మ మ్మల్ని నిర్ణయించమన్నా ఓకే. తాడో పేడో తేల్చుకుందాం. నువ్వు వస్తవా..? మమల్ని రమ్మంటవా..? ప్రశ్న పత్రాల లీకేజీలో నీ పాత్ర లేనట్లయితే నీ సెల్ఫోన్ను ఎందుకు దాచిపెట్టినవ్. భ యం ఎందుకు పడుతున్నవ్. నేనొక్కటే సవాల్ చేస్తున్నా ధర్మం కోసం నిలబడే వ్యక్తివి అయితే వెంటనే మొబైల్ను పోలీసులకు ఇచ్చేయాలి’ అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ఘాటుగా స్పందించారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తారక హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. బహిరంగ చర్చకు హోదాలు అవసరం లేదని, బండి ఎంపీగా ఉంటే తాను రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, తేదీ, స్థలం ప్రకటించాలని సవాల్ చేశారు.
ఈ విషయంలో వెనక్కి పోతే బాగుండదన్నారు. నిజంగానే సెల్ఫోన్లో ఏం లేకపోతే పోలీసులకు ఫోన్ అప్పగించేందుకు సంజయ్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తనకు చెందిన పది పాత ఫోన్లను ధైర్యంగా ఈడీ అధికారులకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. బూర ప్రశాంత్ ఏబీవీపీ కరీంనగర్ ఇన్చార్జిగా పని చేయలేదా..? అని ప్ర శ్నించారు. బండి సంజయ్కి అనుచరుడిగా పనిచేసింది నిజం కాదా..? ప్రస్తుతం నమో టీంలో పని చేస్తుండడం వాస్తవం కాదా..? అని నిలదీశారు. నిజంగా ధైర్యవంతునివి, ధర్మం కోసం పని చేసేది నిజమైతే వెంటనే సెల్ఫోన్ ఇచ్చేయాలని సూచించారు. ఇప్పటికైనా బండి తన భాష తీరును మా ర్చుకోవాలని హితవుపలికారు. కవితను, మంత్రి కేటీఆర్ను అరెస్టు చేస్తామని మాట్లాడుతున్న సం జయ్ను నేనొక్కటే అడుగుతున్నా..? సీబీఐ, ఈడీ ‘నీ అయ్య జాగీరా’ అని ప్రశ్నించారు.
ఆ సంస్థలు ఏమైనా మీ జేబు సం స్థలా అని నిలదీశారు. ఇప్పటికే మూడు సార్లు ప్రివిలేజ్ కింద ఫిర్యాదు చేశారని, దాని వల్ల ఏం సాధించారో చెప్పాలన్నారు. బండి సంజయ్ ఈ పేరుతో పోలీసులను అధైర్యపర్చాలని చూస్తున్నాడని, మీరు విచారిస్తే సరి.. ఇక్కడి పోలీసులు విచారిస్తే తప్పా అని ప్రశ్నించారు. మైనర్ బాలుడిని సైతం ఈ కేసులో ఈ బండి బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. పేపర్ లీకేజీల పేరుతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న కుట్ర పన్నారని దుయ్యబట్టారు.సింగరేణిలో పనిచేయలేక, ఇంకా చనిపోయిన వారి డిపెండెంట్లకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని చెప్పారు. ఇదే బీజేపీ ఒకప్పుడు సింగరేణిలో కారుణ్య నియామకాలు లేకుండా చేసిందని, కానీ సీఎం కేసీఆరే కార్మికుల సంక్షేమం దృష్ట్యా మళ్లీ అమలు చేశారని చెప్పారు. కానీ, సింగరేణిలో 60 వేల ఉద్యోగులు తొలగించారని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, ఆధారాలుంటే చూపాలని సూచించారు. ప్రధాని మోడీ, అమిత్ షా తనకు చాలా దగ్గర అని చెప్పుకుంటూ తిరిగే బండి, జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల ఎందుకు తీసుకురాలేకపోయారో చెప్పాలన్నారు. అభివృద్ధి, ఇతర అన్ని విషయాల్లో చర్చకు సిద్ధం గా ఉన్నామని తెలిపారు. ఏ తేదీన, ఎక్కడ చర్చ పెడుతారో బండి సంజయ్ చెప్పాలని సవాల్ చేశా రు. తేదీ ప్రకటించకుండా వెనక్క పోతే బాగుండదన్నారు. బండి తన భాషాను మార్చుకోకపోతే మర్యాదగా ఉండదని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పెండ్యాల మహేశ్కుమార్, గుంజపడుగు హరిప్రసాద్, కెంసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.