చొప్పదండి, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తున్నదని సర్పంచ్ దామెర విద్యాసాగర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండలో నల్ల సత్యారెడ్డికి చెందిన మూడెకరాల్లో బుధవారం ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ విద్యాసాగర్రెడ్డి మాట్లాడుతూ, రైతులు ఆయిల్ పామ్ సాగుపై దృష్టిసారించాలని సూచించారు.
వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ పంట సాగు చేసి అధిక దిగుబడి పొందాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ కో-ఆర్డినేటర్ సుధాకర్రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి రోహిత్, ఏఈవో రాజశేఖర్, నాయకుడు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.