పెద్దపల్లి టౌన్, నవంబర్ 25: మోదీ పాలనలో పేదలకు తీరని అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. దేశంలో ప్రమాదకర విద్యుత్ బిల్లును రాష్ర్టాలపై రుద్దుతూ, వినియో గదారులపై నెల నెలా కరెంట్ చార్జీల మోత మోగిస్తున్నదని వి మర్శించారు. శుక్రవారం సిరి ఫంక్షన్లో సీపీఐ పా ర్టీ పెద్దపల్లి జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సీబీఐ, ఏసీబీ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను బీజేపీ పార్టీకి అనూకులంగా మార్చుకొని తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక, గోవా తదితర రాష్ర్టాలమీద కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఈడీ, ఐటీ దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నదన్నారు. మోదీ పాలనలో వ్యవసాయ, పారిశ్రామిక, కార్మిక, ప్రభుత్వ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
దేశంలోని సంపద కొంతమందికే అన్నట్టుగా నలుగురి కోసం దేశాన్ని తాకట్టు పెట్టిందని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న ట్యాక్స్లతోనే కేంద్రం ప్రభుత్వాన్ని నడుపుతున్నదని దుయ్య బట్టారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా మారడం మంచి పద్ధతి కాదని, గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న చలో రాజ్భవన్కు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రశ్నిం చే గొంతుకులైన సాయిబాబా, వరవరరావు లాం టి మేధావులపై బీమా, కోరెగాం కుట్ర కేసులు నమోదుచేసిందని ఆరోపించారు. ప్రభు త్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంతోపాటు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, విద్యుత్ చార్జీ ధరల పెంచిందని, దీని వల్ల రైతులు, పేద సామాన్య, మధ్యతరగతి ప్రజలు బ్రతికే స్థితి మారిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహరంలో బీఎల్ సంతోష్కు నోటిసులు ఇస్తే బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీళ్లు కారుస్తున్నాడని, గతంలో ఎంతో మంది మేధావుల మీద కుట్రకేసులు పెట్టినప్పు డు, జైల్లో పెట్టినప్పుడు ఎందుకు కన్నీళ్లు రాలేదని విమర్శించారు. ఇక్కడ సీపీఐ రాష్ట్ర సమితి సభ్యు లు కలవేన శంకర్, తాండ్ర సదానందం, జిల్లా నాయకులు గూడెం లక్ష్మి, గడెపె మల్లేశ్, గౌతం గోవర్ధన్, గోసిక మోహన్, కన్నేబోయిన కనకరాజు, కడారి సునిల్, కోడం స్వామి, తాల్లపల్లి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.