Chigurumamidi | చిగురుమామిడి, మే 19 : చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో జనగణన సర్వే నిర్వహిస్తున్నారు. మండలంలోని 17 గ్రామాలకు గాను 70 మంది ఎన్యూమిలేటర్స్, 11 మంది సూపర్వైజర్లు జనగణన సర్వేలో పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబానికి 34 ప్రశ్నలతో కూడిన సమాధానాలను నమోదు చేసుకుంటున్నారు. ఇంటి పేరు, కుటుంబ నేపథ్యం, స్థితిగతులు, మౌలిక వసతులు మొదలగు అంశాలను సర్వేలో నమోదు చేసుకుంటున్నారు.
జూన్ 9 వరకు జనగణన సర్వే పూర్తి చేయాలని అడిషనల్ చార్జి ఆఫీసర్ ఎంపీడీవో విజయ్ కుమార్ తెలిపారు. కాగా మంగళవారం మండలంలోని చిగురుమామిడి, రేకొండ తదితర గ్రామాల్లో సర్వే పనులను పరిశీలించారు. మండలంలోని ప్రజలు జనగణన సర్వేకు పూర్తిస్థాయిలో సహకరించాలని వారు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.