హుజూరాబాద్టౌన్, ఫిబ్రవరి 7: ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రోద్బలంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నరు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నరు. ఖబడ్దార్ రాజేంద్రా.. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో.. మా కార్యకర్తల జోలికివస్తే ఉరుకునేది లేదు’ అని బీఆర్ఎస్ యువనేత, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హుజూరాబాద్లో విలేకరులతో కౌశిక్రెడ్డి మాట్లాడా రు. కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో ఆదివారం సాయంత్రం ఈటల రాజేందర్ పర్యటించారని, ఈ క్రమంలో గత ఎన్నికల్లో రాజేందర్ ఇచ్చిన హామీని ప్రజలు గుర్తుచేశారని, రోడ్డు ఏమైంది? అని ప్రశ్నిస్తే అకడున్న ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ గుండాలు అతి క్రూ రంగా, అన్యాయంగా కొట్టారన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయ ని చెప్పారు.
గ్రామానికి చెందిన వీరేశం, శ్యామ్, ప్రవీణ్ను బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీపీ మాట్ల రమేశ్, కళ్యాణ్, సర్పంచ్ శ్రీనివాస్, సతీశ్, శోభన్, అమరేందర్ దారుణంగా కొట్టారన్నారు. ఏం జరిగినా తనతోపాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నామని, ప్రజాస్వామ్య యుతంగా వెళ్తున్నామని చెప్పారు. తాము తలుచుకుంటే ఈటల ఒకరోజు కూడా నియోజకవర్గంలో తిరగలేడని స్పష్టం చేశారు. ఈటల కావాలనే బీజేపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నాడని, ఇంకా దొంగే దొంగ అన్నట్లుగా రివర్స్లో తమ పై ఆరోపణలు చేస్తున్నారని, స్పెషల్ పార్టీ పోలీసులతో తామే బీజేపీ కార్యకర్తలను కొట్టిస్తున్నారని అంటున్నాడని దుయ్యబట్టారు. రోజు రోజుకూ తన ఉనికిని కోల్పోతున్నాననే అభద్రతా భావంతోనే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఈటల గొప్ప నటుడు
ఈటల గొప్ప నటుడని, ఆయనకు నంది అవార్డు ఇవ్వొచ్చని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎంతో మంది అమాయకులైన దళిత, బడుగు బలహీన బిడ్డలపై కేసులు నమోదు చేయించి, ఠాణాల్లో చిత్రహింసలు పెట్టించిన చరిత్ర ఈటలదని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆయనపై గతంలో పలు హత్యలకు సంబంధించి కూడా ఆరోపణలు ఉన్న విషయం వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాల దళితుల అసైన్డ్ భూములు ఆక్రమించారని, ఈ విషయాలన్ని సాక్ష్యాలతో సహా హుజూరాబాద్ అంబేదర్ కూడలి సాక్షిగా నిరూపిస్తానని స్పష్టం చేశారు. ఇటీవల మంత్రి, బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జమ్మికుంటలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడం, ఇంకా ఈటల సొంత గ్రామం కమలాపూర్లో పర్యటనలో అమాత్యుడికి ప్రజలు బ్ర హ్మరథం పట్టడాన్ని రాజేందర్తోపాటు బీజేపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
ఈటల పోలీసు కేసుల గురించి మాట్లాడడం, దాడుల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో మరోసారి సానుభూతి పొందేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లేచేస్తున్నాడని, నీతి మాలిన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈటల.. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని, కేంద్రం నుంచి ఒక పైసా కూడా తీసుకురాలేదని, ప్రజలకు సొల్లు కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ఈ విషయం బయటకు రాకుండా కొత్త నాటకాలకు తెరలేపుతున్నాడని వీటిని ప్రజలు గమనించాలని కౌశిక్రెడ్డి కోరా రు. గులాబీ కార్యకర్తలు, ప్రజలకు తాను అండ గా ఉంటానని, నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలపై ఎవరు దాడులు చేసినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు,నాయకులు ఉన్నారు.