రాజన్న సిరిసిల్ల, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో అమాత్యుడిగా రైతుకు తోడుండి, నష్టమొస్తే ఆదుకుని, వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపక్షంలోనూ అభయమిస్తున్నారు. ఓవైపు సాగునీరు లేక.. మరోవైపు వడగండ్ల వానతో పంటలు దెబ్బతినగా.. అన్నదాత పక్షాన కొట్లాటకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వడగండ్ల వానకు ముస్తాబాద్ మండలంలో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు గురువారం వస్తున్నారు.
ఉద యంపది గంటల తర్వాత గన్నవానిపల్లెలో దెబ్బతిన్న పొలాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ముస్తాబాద్లో అకాల వర్షానికి విద్యుత్ స్తంభం విరిగిపడి మృతిచెందిన ఎల్సాని ఎల్లయ్య, ఆర్థికం గా నష్టపోయిన హోటల్ యజమాని రవి కుటుంబాలను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి సి రిసిల్ల పట్టణానికి చేరుకుంటారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు హాజరు కానున్నారు. సా యంత్రం 6గంటలకు బీవైనగర్లోని షాదీఖానలో ముస్లింలతో ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.