రాయికల్, ఫిబ్రవరి 18: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలా లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని చెప్పారు. శనివారం రాయికల్ మండలంలోని అల్లిపూర్కు చెందిన పలువురు కుల సం ఘాల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గు లాబీ ప్రభంజనం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
చేరినవారిలో ఎంబారి రాజన్న, డిష్ శేఖర్, ఆనంద్, ప్రభాకర్, రాజేశ్, సత్యనారాయణ ఉన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజలింగం, మోర విజయలక్ష్మీ వెంకటేశ్, ఉప సర్పంచ్ సాగర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు రత్నాకర్, మండల కో ఆప్షన్ ముఖీద్, మండల ఉపాధ్యక్షుడు అనుమల్ల మ హేశ్, బీసీ సెల్ నాయకులు వెంకటేశ్, యూత్ అధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.