గోదావరిఖని, అక్టోబర్ 27: ‘అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ సింగరేణి కార్మికులను ఆగం చేసింది. వారసత్వ ఉద్యోగాలను ఎగ్గొట్టింది.. ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలు ఆ పార్టీ నాయకుల దుర్మార్గుల మాటలు నమ్మద్దు’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. కానీ, స్వయంపాలనలో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అందిస్తూ, వేతనాలు, లాభాల వాటా పెంచి వెలుగులు నింపారని పేర్కొన్నారు. శుక్రవారం ఆర్జీ-1 జీడీకే-2ఏ గని, రామగుండం కార్పొరేషన్ 11, 12, 10, 28, 40,30, 41 డివిజన్లలో ప్రజా అంకితయా త్ర చేపట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. 11వ డివిజన్లో కాంగ్రెస్కు చెందిన 20 మంది బీఆర్ఎస్లో చేరగా వా రికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. 20 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు దక్కాయని పే ర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారుతోనే సింగరేణి మనుగడ సాధ్యమన్నారు. సకల జనుల సమ్మె లో కార్మికుల వేతనాల్లో కోత విధించవద్దని తా ను అసెంబ్లీలో సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి కరోనా కాలపు వేతనంతో పాటు తెలంగాణ ఇంక్రిమెంట్ను కూడా మం జూరు చేశారన్నారు. ప్రజలు ఆలోచించాలని చేసిన పనులను చూసి బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించాలని కోరారు.
డబ్బు సంచులతో వచ్చే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి, మాదాసు రాంమ్మూర్తి, జాహిద్ పాషా, శేషగిరి, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, బుచ్చిరెడ్డి, బొడ్డు రజిత, నాయకులు మండ రమేశ్, మల్లయ్య, పొలాడి శ్రీనివాస రావు, వడ్డెపల్లి శంకర్, వెంకటేష్, మారుతి, చెల్కలపల్లి శ్రీనివాస్, తోకల రమేశ్, దాసరి శ్రీనివాస్, బిక్కినేని నర్సింగరావు, నా యకులు కౌశిక హరి, వడ్డెపల్లి శంకర్, తోడేటి శంకర్, డా.శ్రీహరి, జ డ్సన్, దాసరి ఎల్లయ్య, సునీల్, స్వరూప, రాజే శం, ఈర్ల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోరుకంటి చందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పి లుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో ఎ మ్మెల్యే కోరుకంటి చేపట్టిన ప్రజా అంకితయాత్ర సాయంత్రం ప్రధాన చౌరస్తాకు చేరుకున్నది. ఈ సందర్భంగా ప్రచార రథం పలువురిని ఆకట్టుకున్నది. ఎంపీ, మాజీ ఎమ్మె ల్సీ హాజరై మాట్లాడారు. రామగుండం అభివృద్ధి చెందాలంటే కోరుకంటి చందర్కు మరోసారి గెలిపించాలని కోరారు.
ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు దరిదాపుల్లోకి కూడా రానీయకూడదని, అబద్ధపు ప్రచారాలతో వచ్చే ఆ పార్టీల నాయకులు ఇన్నాళ్లు ఓట్లు వేస్తే ఏం చేశారని నిలదీయాలన్నారు. రామగుండంకు రాదనుకున్న మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ను ఒప్పించి తేవడంతోపాటు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి రూ.300 కోట్ల నిధులు తీసుకువచ్చిన చందర్ను మరోసారి గెలిపించుకుంటే రామగుండం మరిం త అభివృద్ధి చెందుతుందన్నారు. యా త్రకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చౌరస్తా ప్రాంతం గులాబీమయమైంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పాటలు ఆలోచింపజేశాయి.